యాప్నగరం

‘పరుగు పరుగు’.. ‘చిత్రలహరి’ తొలి పాట అదిరింది!

‘చిత్రలహరి’లోని తొలి పాటను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. లిరిక్ వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ యూట్యూబ్‌లో ఉంచింది. ‘పరుగు పరుగు’ అని సాగే ఈ పాట దేవీశ్రీ స్టైల్లోనే యువతను ఆకట్టుకునేలా ఉంది.

Samayam Telugu 19 Mar 2019, 6:24 pm
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘చిత్రలహరి’. క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్లు. ‘నేను శైల‌జ’ వంటి యూత్‌ఫుల్ లవ్‌స్టోరీని అందించిన కిషోర్ తిరుమ‌ల ద‌ర్శక‌త్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, చెరుకూరి మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. సునీల్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Samayam Telugu Sai_Dharam


ఈ నేపథ్యంలో చిత్రంలోని తొలి పాటను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. లిరిక్ వీడియోను సోనీ మ్యూజిక్ యూట్యూబ్‌లో ఉంచింది. ‘పరుగు పరుగు’ అని సాగే ఈ పాట దేవీశ్రీ స్టైల్లోనే యువతను ఆకట్టుకునేలా ఉంది. దేవీశ్రీ ప్రసాద్ రచించి స్వరపరిచిన ఈ పాటను డేవిడ్ సైమన్ ఆలపించారు. సినిమాలోని హీరోకి ఉన్న అసహనాన్నంతా ఈ ఒక్క పాటలో చూపించారు. లిరిక్ వీడియోలో చేసిన యానిమేషన్ గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి.

అంతేకాకుండా, ఈ పాటలో ఓ కొత్తరకం సాక్సోఫోన్‌ను దేవీశ్రీ వాడారు. మార్టిన్ అనే విదేశీ వాయిద్యకారుడు ఈ సాక్సోఫోన్‌ను ప్లే చేశారు. అతన్ని కూడా లిరిక్ వీడియోలో చూపించారు. మొత్తానికి ఓ మంచి పాటతో ‘చిత్రలహరి’ ఆడియోను సాయిధరమ్ మొదలుపెట్టారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ పాటకు కూడా అలాంటి స్పందనే వస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.