యాప్నగరం

‘చిత్రలహరి’ బాక్సాఫీస్.. నిలకడగా, నిదానంగా!

డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిలో ఇప్పటికే 80 శాతం వసూలైనట్లు పీఆర్ఓ వంశీ కాకా ట్వీట్ చేశారు. నాలుగు రోజుల్లో రూ.20 కోట్లు వసూలు చేసిందని పేర్కొన్నారు.

Samayam Telugu 16 Apr 2019, 1:35 pm
సాయిధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తోంది. రివ్యూలు కాస్త అటుఇటుగా వచ్చినా ప్రేక్షకులు మాత్రం సినిమాను బాగానే ఆదరిస్తున్నారు. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీనిలో డిస్ట్రిబ్యూటర్ల షేర్ 11.27 కోట్ల రూపాయలని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం నాలుగు రోజుల్లో రూ.8.86 కోట్ల షేర్‌ను రాబట్టిందని తెలుస్తోంది. మొత్తం మీద ‘చిత్రలహరి’ నిదానంగా వసూళ్లను రాబడుతోంది.
Samayam Telugu Chitralahari


డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిలో ఇప్పటికే 80 శాతం వసూలైనట్లు పీఆర్ఓ వంశీ కాకా ట్వీట్ చేశారు. నాలుగు రోజుల్లో రూ.20 కోట్లు వసూలు చేసిందని పేర్కొన్నారు.

‘చిత్రలహరి’ విడుదలకు ముందే రూ.13.50 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం. దీనిలో తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ విలువ రూ.10.5 కోట్లట. ఈ మొత్తంలో ఇప్పటికే రూ.8 కోట్లకు పైగా వసూలైంది కాబట్టి 80 శాతం రికవరీ అయిపోయినట్టే. బయ్యర్ల సొమ్ము వసూలైపోతుంది కానీ, పెద్దగా లాభాలు రాకపోవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు. సోమవారం ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ.80 లక్షలే వసూలు చేయడం ఈ విశ్లేషణలకు ఊతమిస్తోంది. ఈ వీక్ డేస్‌లో వసూళ్లు మందకొడిగా ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు ఈ శుక్రవారం ‘జెర్సీ’ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ ప్రభావం కూడా ‘చిత్రలహరి’పై పడొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.