మలయాళీ ప్రేక్షకులకు అల్లూ అర్జున్ చిత్రాలంటే భలే క్రేజ్. బన్నీ నటించిన ఏ చిత్రమైనా సరే అక్కడ విడుదల కావాల్సిందే. ఈ అభిమానంలో తమ్ముడు శిరీష్ కూడా పాలు పంచుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఓ మలయాళీ చిత్రంలో బంపర్ ఆఫర్ కొట్టేశాడు. అది కూడా అలాంటి ఇలాంటి చిత్రం కాదు. 1971 ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం. మేజర్ రవీ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లూ శిరీష్ బ్యాటిల్ ట్యాంక్ కమాండర్ లెఫ్టినెంట్ చిన్మయ్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం శిరీష్తో పాటు రాణా దగ్గుబాటి, విజయ్ సేతుపతిలను కూడా చిత్ర యూనిట్ సంప్రదించినట్లు తెలిసింది. అయితే, శిరీష్ స్క్రిప్ట్ విన్న వెంటనే ఓకే చెప్పేశాడు. ఈ సందర్భంగా శిరీష్ మాట్లాడుతూ.. ‘‘బన్నీకి ఇక్కడ ఉన్న అభిమానుల గురించి తెలుసు. ఇక్కడి చిత్రాలను కూడా నేను చూస్తుంటాను. మేజర్ రవీ తీసిన కీర్తి చక్రా, పికెట్ 43 చిత్రాల గురించి నేను విన్నాను. చిత్రంలో నాకు ఒక రొమాంటిక్ ట్రాక్ ఉంది. అయితే, నా సహ నటి ఎవరో ఇంకా నిర్ణయించలేదు’’ అని తెలిపాడు. మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం షూటింగ్ నవంబరు నుంచి రాజస్థాన్లో మొదలవుతుంది
అల్లూ శిరీష్కు మల్లూవుడ్లో బంపర్ ఆఫర్!
అల్లూ వారసులకు మల్లూవుడ్ బ్రహ్మరథం పడుతోంది. అన్న బన్నీ చిత్రాలను ఆధరించిన మల్లూ ప్రేక్షకులు త్వరలో సోదరుడు శిరీష్ను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
TNN 23 Oct 2016, 3:57 pm