కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో సినిమా రంగం కూడా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా సుమారు ఐదు నెలలకు పైగా సినిమా థియేటర్లు మూతబడ్డాయి. దీని వల్ల విడుదలకు సిద్ధంగా ఉన్న ఎన్నో తెలుగు సినిమాలు ల్యాబ్లలోనే ఉండిపోయాయి. చిన్న చిన్న సినిమాలు ఓటీటీ ద్వారా విడుదలైపోతున్నాయి. అయితే, భారీ బడ్జెట్తో తెరకెక్కించిన స్టార్ హీరోల సినిమాలను ఓటీటీ విడుదల చేసే ధైర్యం చేయలేకపోతున్నారు దర్శక నిర్మాతలు. థియేటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే అనుమతుల కోసం వేచి చూస్తున్నారు.
అయితే, వారి ఎదురు చూపులకు త్వరలోనే తెరపడనుందని అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. దేశవ్యాప్తంగా అన్లాక్ 4.0లో భాగంగా సినిమా థియేటర్లు తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వనుందని అంటున్నారు. మూడో దశ అన్లాక్లో భాగంగా ఇప్పటికే రెస్టారెంట్లు, మాల్స్, జిమ్, యోగా కేంద్రాలు తెరుచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు చివరినాటికి అన్లాక్ 3.0 ముగియనుంది. ఆ తరవాత అన్లాక్ 4.0ను ప్రధాని మోదీ ప్రకటిస్తారు. ఈ నాలుగో దశలో థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇవీ నిబంధనలు..
సినిమా థియేటర్లు తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కఠినమైన నిబంధనలు పెట్టనుందని సమాచారం. ప్రేక్షకులు సామాజిక దూరం పాటించేలా సీట్ల మధ్య ఖాళీలు ఉంచుతూ కూర్చోబెట్టాలి. అంటే, ఇద్దరు ప్రేక్షకుల మధ్య ఒకటి లేదా రెండు సీట్లు వదిలిపెట్టాలి. అలాగే, షో ప్రారంభంకావడానికి ముందు.. పూర్తయిన తరవాత థియేటర్ మొత్తాన్ని శానిటైజ్ చేయాలి. కరోనా వైరస్ చల్లని వాతావరణంలో బతుకుతుంది కాబట్టి.. థియేటర్లో టెంపరేచర్ 24 డిగ్రీల కన్నా తక్కువ ఉండకుండా చూసుకోవాలి. ప్రేక్షకులు కచ్చితంగా మాస్క్ ధరించే థియేటర్ లోపలికి వెళ్లాలి. ప్రస్తుతం చైనాలో థియేటర్లు ఇవే నిబంధనలను పాటిస్తున్నాయి.
Also Read: ప్రభాస్ ‘ఆదిపురుష్’: రావణుడిగా బాలీవుడ్ హీరో
అయితే, థియేటర్లు తెరుచుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేస్తుందని అంటున్నారు. నిజానికి అన్లాక్ 3.0కు ముందు కూడా సినిమా హాళ్లపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేస్తుందని ప్రచారం జరిగింది. కానీ, అది జరగలేదు. ఇప్పుడు ఈ ప్రచారంపై కూడా అదే అనుమానం తలెత్తుతోంది. ఇది రూమర్గా మిగిలిపోతుందా.. లేకపోతే నిజంగా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేస్తుందా అనే విషయం తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే!
అయితే, వారి ఎదురు చూపులకు త్వరలోనే తెరపడనుందని అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. దేశవ్యాప్తంగా అన్లాక్ 4.0లో భాగంగా సినిమా థియేటర్లు తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వనుందని అంటున్నారు. మూడో దశ అన్లాక్లో భాగంగా ఇప్పటికే రెస్టారెంట్లు, మాల్స్, జిమ్, యోగా కేంద్రాలు తెరుచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు చివరినాటికి అన్లాక్ 3.0 ముగియనుంది. ఆ తరవాత అన్లాక్ 4.0ను ప్రధాని మోదీ ప్రకటిస్తారు. ఈ నాలుగో దశలో థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇవీ నిబంధనలు..
సినిమా థియేటర్లు తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కఠినమైన నిబంధనలు పెట్టనుందని సమాచారం. ప్రేక్షకులు సామాజిక దూరం పాటించేలా సీట్ల మధ్య ఖాళీలు ఉంచుతూ కూర్చోబెట్టాలి. అంటే, ఇద్దరు ప్రేక్షకుల మధ్య ఒకటి లేదా రెండు సీట్లు వదిలిపెట్టాలి. అలాగే, షో ప్రారంభంకావడానికి ముందు.. పూర్తయిన తరవాత థియేటర్ మొత్తాన్ని శానిటైజ్ చేయాలి. కరోనా వైరస్ చల్లని వాతావరణంలో బతుకుతుంది కాబట్టి.. థియేటర్లో టెంపరేచర్ 24 డిగ్రీల కన్నా తక్కువ ఉండకుండా చూసుకోవాలి. ప్రేక్షకులు కచ్చితంగా మాస్క్ ధరించే థియేటర్ లోపలికి వెళ్లాలి. ప్రస్తుతం చైనాలో థియేటర్లు ఇవే నిబంధనలను పాటిస్తున్నాయి.
Also Read: ప్రభాస్ ‘ఆదిపురుష్’: రావణుడిగా బాలీవుడ్ హీరో
అయితే, థియేటర్లు తెరుచుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేస్తుందని అంటున్నారు. నిజానికి అన్లాక్ 3.0కు ముందు కూడా సినిమా హాళ్లపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేస్తుందని ప్రచారం జరిగింది. కానీ, అది జరగలేదు. ఇప్పుడు ఈ ప్రచారంపై కూడా అదే అనుమానం తలెత్తుతోంది. ఇది రూమర్గా మిగిలిపోతుందా.. లేకపోతే నిజంగా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేస్తుందా అనే విషయం తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే!