'డైరెక్షన్ వేరు.. కెమెరా వేరు.. నేను దర్శకుడిగా అన్ని విభాగాలను హ్యాండిల్ చేయలేకపోయా.. అందుకే మళ్లీ మరోసారి మెగా ఫోన్ పట్టను..' అని అంటున్నారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ (PC Sreeram). నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా విక్రమ్ కె.కుమార్ (Vikram K Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన థ్యాంక్ యూ (Thank You) మూవీకి ఆయన ఛాయాగ్రహకుడిగా వ్యవహించారు. నేడు ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుండగా.. ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సినిమా గురించి ఆసక్తిక విషయాలను పీసీ శ్రీరామ్ పంచుకున్నారు.
ప్రస్తుతం సమాజంలో మానవీయ విలువలు రోజురోజుకు తగ్గిపోతున్నాయని.. సోషల్ మీడియాలో ద్వేషించుకోవడమే ఎక్కువైందని అన్నారు పీసీ శ్రీరామ్. ఒకరికొకరు మాట్లాడుకోవడం కూడా మానేశారని.. కృతజ్ఞత చూపించడం కూడా మర్చిపోయారన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో థ్యాంక్ యూ మూవీ వంటి సినిమా రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఆయన. ఈ సినిమా కథ తనకు చెప్పినప్పుడే కనెక్ట్ అయిపోయానని.. ఇందులో భావోద్వేగాలు తనను ఎంతో ప్రభావితం చేశాయని పీసీ చెప్పుకొచ్చారు.
దేశం గర్వించదగ్గ ఛాయాగ్రకులలో ఒకరిగా నిలిచిన పీసీ శ్రీరామ్ డైరెక్టర్గా వ్యవహరించారు. ముఖ్యంగా మణిరత్నం సినిమాలలో ఆయన కెమెరా పనితనాన్ని ఆడియన్స్ ఎప్పటికి మర్చిపోలేరు. సినిమాటోగ్రాఫర్గా సక్సెస్ అయిన ఆయన.. డైరెక్టర్గానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేకపోవడంతో మరోసారి దర్శకత్వం వహించలేదు.
ఈ విషయంపై పీసీ శ్రీరామ్ మాట్లాడుతూ.. డైరెక్షన్, కెమెరా వేరు అని తెలుసుకున్నానని.. అన్ని విభాగాలను తాను హ్యాండిల్ చేయలేకపోయానని అన్నారు. తాను దర్శకుడిగా పనిచేశానని అయితే మంచి ఫలితాలు రాలేదన్నారు. అందుకే మరోసారి డైరెక్షన్ చేయలేదని.. ఎప్పటికీ మెగాఫోన్ పట్టనని చెప్పారు. థ్యాంక్ యూ మూవీలో నాగ చైతన్య యాక్టింగ్ ప్రత్యేకంగా చెప్పాలని.. టీనేజ్ కుర్రాడి నుంచి మూడు పదుల వయసు దాటిన వ్యక్తి పాత్రలలో చైతూ కనిపించిన విధానం తనకు బాగా నచ్చిందంటూ చెప్పుకొచ్చారు ఈ సూపర్ హిట్ ఛాయాగ్రహకుడు.
ప్రస్తుతం సమాజంలో మానవీయ విలువలు రోజురోజుకు తగ్గిపోతున్నాయని.. సోషల్ మీడియాలో ద్వేషించుకోవడమే ఎక్కువైందని అన్నారు పీసీ శ్రీరామ్. ఒకరికొకరు మాట్లాడుకోవడం కూడా మానేశారని.. కృతజ్ఞత చూపించడం కూడా మర్చిపోయారన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో థ్యాంక్ యూ మూవీ వంటి సినిమా రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఆయన. ఈ సినిమా కథ తనకు చెప్పినప్పుడే కనెక్ట్ అయిపోయానని.. ఇందులో భావోద్వేగాలు తనను ఎంతో ప్రభావితం చేశాయని పీసీ చెప్పుకొచ్చారు.
దేశం గర్వించదగ్గ ఛాయాగ్రకులలో ఒకరిగా నిలిచిన పీసీ శ్రీరామ్ డైరెక్టర్గా వ్యవహరించారు. ముఖ్యంగా మణిరత్నం సినిమాలలో ఆయన కెమెరా పనితనాన్ని ఆడియన్స్ ఎప్పటికి మర్చిపోలేరు. సినిమాటోగ్రాఫర్గా సక్సెస్ అయిన ఆయన.. డైరెక్టర్గానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేకపోవడంతో మరోసారి దర్శకత్వం వహించలేదు.
ఈ విషయంపై పీసీ శ్రీరామ్ మాట్లాడుతూ.. డైరెక్షన్, కెమెరా వేరు అని తెలుసుకున్నానని.. అన్ని విభాగాలను తాను హ్యాండిల్ చేయలేకపోయానని అన్నారు. తాను దర్శకుడిగా పనిచేశానని అయితే మంచి ఫలితాలు రాలేదన్నారు. అందుకే మరోసారి డైరెక్షన్ చేయలేదని.. ఎప్పటికీ మెగాఫోన్ పట్టనని చెప్పారు. థ్యాంక్ యూ మూవీలో నాగ చైతన్య యాక్టింగ్ ప్రత్యేకంగా చెప్పాలని.. టీనేజ్ కుర్రాడి నుంచి మూడు పదుల వయసు దాటిన వ్యక్తి పాత్రలలో చైతూ కనిపించిన విధానం తనకు బాగా నచ్చిందంటూ చెప్పుకొచ్చారు ఈ సూపర్ హిట్ ఛాయాగ్రహకుడు.