యాప్నగరం

Maa Ishtam: కోట్లలో మోసం.. నట్టి కుమార్ పిటిషన్‌తో వర్మకు సివిల్ కోర్టు ఆదేశాలు

రామ్ గోపాల్ వర్మ రూపొందించిన లేటెస్ట్ మూవీ డేంజరస్ (మా ఇష్టం) వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా విడుదలను వెంటనే నిలిపివేయాలంటూ వర్మకు సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Samayam Telugu 7 Apr 2022, 1:45 pm
రామ్ గోపాల్ వర్మకు వివాదాలు కొత్తేమీ కాదు. ఆయన రూపొందిస్తున్న సినిమాలు, చేసే కామెంట్స్ నిత్యం జనాల్లో చర్చనీయాంశం అవుతూనే ఉంటాయి. కాంట్ర‌వ‌ర్సియ‌ల్ డైరెక్ట‌ర్‌గా పేరొందిన ఆయన సినిమాలు విడుదలయ్యే వరకు డౌటే. ఏదో ఒక రూపంలో వివాదం వెంటాడుతూనే ఉంటుంది. తాజాగా వర్మ లేటెస్ట్ మూవీ డేంజరస్ (మా ఇష్టం) విషయంలో అదే జరిగింది. ఈ సినిమా రిలీజ్ ఆపేయాలంటూ వర్మకు సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Samayam Telugu నట్టి కుమార్ పిటిషన్‌తో వర్మకు సివిల్ కోర్టు ఆదేశాలు
Rgv- Natti Kumar


తనకు డబ్బులు ఇవ్వకుండా ఆర్జీవీ తప్పించుకుంటున్నాడని నిర్మాత నట్టి కుమార్ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వర్మ నుంచి తనకు 5 కోట్ల 29 లక్షలు రావాలని, ప్రతి సినిమాకు 50 లక్షలు ఇవ్వాలన్న నిబంధనలను ఆయన తుంగలో తొక్కారని నట్టి కుమార్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కోర్టు వాదప్రతివాదనలు విన్న తర్వాత ఆర్జీవీ తీసిన 'మా ఇష్టం' సినిమా రిలీజ్‌ను ఆపాలని సిటీ సివిల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అంతా ఓకే అనుకున్న తరుణంలో ఇలా రామ్ గోపాల్ వర్మకు ఊహించని పరిణామం ఎదురైంది.
Ghani Pre Release Business: థియేటర్స్ కౌంట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే!
నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రమే డేంజరస్ (మా ఇష్టం). ఎప్పటికప్పుడు కాస్త కొత్తగా, బోల్డ్‌గా ఆలోచించే వర్మ.. ఇండియాలో తొలి లెస్బియన్ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన అన్ని అప్‌డేట్స్ సినిమాపై ఇంట్రెస్ట్ పెంచాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.