యాప్నగరం

ఇద్దరు హీరోయిన్ల మధ్య పచ్చ గడ్డేస్తే భగ్గుమంటోందట!

ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లకి చాలామందికి ఒకరంటే ఒకరికి గిట్టదనే అభిప్రాయం వున్న సంగతి తెలిసిందే.

TNN 2 Jun 2017, 4:08 pm
ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లకి చాలామందికి ఒకరంటే ఒకరికి గిట్టదనే అభిప్రాయం వున్న సంగతి తెలిసిందే. ఆ అభిప్రాయం నిజమే అని నిరూపిస్తున్నారు తాజాగా జుడ్వా 2 సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్న తాప్సీ పన్ను, జాక్వెలిన్ ఫెర్నాండెజ్. జుడ్వా 2 సినిమాలో వరుణ్ ధావన్ సరసన హీరోయిన్స్‌గా నటిస్తున్న తాప్సి, జాక్వెలిన్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డేస్తే భగ్గుమంటోందట. ఈ ఇద్దరూ కలిసి సెట్స్‌పై వున్నా.. అక్కడేదో యుద్ధ వాతావరణంలా తలపిస్తోందంటున్నారు ఆ ఇద్దరినీ జుడ్వా సెట్స్‌పై చూసినవారు.
Samayam Telugu cold war between taapsee pannu and jacqueline fernandez
ఇద్దరు హీరోయిన్ల మధ్య పచ్చ గడ్డేస్తే భగ్గుమంటోందట!


ఇద్దరికీ ఒకరంటే, మరొకరికి పడకపోవడంతో ఆ ఇద్దరూ ఒకేసారి కలుసుకునే ఛాన్స్ లేకుండా జాగ్రత్తపడుతున్నారట జుడ్వా 2 మేకర్స్. ఇద్దరి డేట్స్‌లోనూ మార్పులు చేర్పులు చేసి మొత్తానికి ఇద్దరు షూటింగ్‌లో ఒకరికి ఒకరు ఎదురుపడకుండా దర్శకుడు, నిర్మాతలు తీసుకోవాల్సినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

ఈ ఇద్దరికీ మధ్య అంత దూరం ఎందుకు పెరిగిందో తెలీదు కానీ తాప్సీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో వరుణ్ ధావన్ మాత్రం క్లోజ్‌గానే వుంటున్నాడట. ఇద్దరితో ఎంత క్లోజ్‌గా వున్నా కానీ ఎంతో కొంత నలిగిపోక మాత్రం తప్పదు కదా అంటున్నారు జుడ్వా యూనిట్ సభ్యులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.