యాప్నగరం

Babu Mohan: జగన్ పాలన మూడు పువ్వులు ఆరు కాయలు: బాబూ మోహన్

ప్రముఖ హాస్య నటుడు, బీజేపీ నాయకుడు బాబూ మోహన్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 23 Aug 2019, 10:34 am
నా ఆఖరి శ్వాస ఉన్నంత వరకూ సినిమాల్లో నటిస్తా.. చివరకి నా శవాన్ని కూడా యాక్టింగ్‌కి ఇస్తా అన్నారు ప్రముఖ కమెడియన్, బీజేపీ లీడర్ బాబూ మోహన్. ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా జీవితంపై ఆసక్తికరమైన విషయాలు తెలిపిన ఆయన.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు నేతల పాలపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
Samayam Telugu YS Jagan Mohan Reddy


Read Also: ‘కౌశల్య కృష్ణమూర్తి’ రివ్యూ: స్లో బౌండరీ

మోదీ పాలన భేష్..

దేశంకోసం ప్రధాని మోదీ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన తీసుకునే ఒక్కో నిర్ణయం దేశ స్థితిగతులను మార్చుతోంది. నాయకుడు అంటే అలా ఉండాలి. బీజేపీలో తనది కార్యకర్త పాత్రే.

Read Also: అతడిపై 490 కేసు.. అమ్మాయిని ట్రాప్ చేశాడు: రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర

ఆత్మాభిమానం చంపుకోలేక బయటకు వచ్చేశా..
నాకు టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్టు ఇవ్వక పోవడం వల్ల పార్టీ నుండి బయటకు రాలేదు. టిక్కెట్ అనేది నాకు ఆఫ్ట్రాల్. ఆత్మాభిమానం చంపుకోలేకే బయటకు వచ్చేశా. నాకు ఎన్టీఆర్ నేర్పింది అదే. ఢిల్లీ నుండి ఆహ్వానం వచ్చింది అందుకే బీజేపీలో చేరా.

జగన్ డైనమిక్.. కేసీఆర్ పాలన కటిక చీకటి
ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ పాలను కటిక చీకటిలా ఉంది. ఏపీలో యువ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి పాలన మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది. బ్రహ్మాండమైన స్పీడ్‌లో డైనమిక్ లీడర్‌గా ముందుకు వెళ్తున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.