యాప్నగరం

ప్రముఖ నటుడు 30 ఇయర్స్ పృథ్వీకి రోడ్డు ప్రమాదం.. కారు ధ్వంసం

ప్రముఖ నటుడు 30 ఇయర్స్ పృథ్వీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో పృథ్వీ కారులోనే ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఈ ప్రమాదం జరిగింది.

Samayam Telugu 20 Oct 2020, 9:05 pm
ఇటీవలే కరోనా సోకి కోలుకున్న ప్రముఖ నటుడు, ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్, 30 ఇయర్స్ పృథ్వీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ రోజు (అక్టోబర్ 20) మధ్యాహ్నం ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో పృథ్వీ కారులోనే ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన విషయాన్ని పృథ్వీ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రమాదం తాలూకు పిక్స్ షేర్ చేశారు.
Samayam Telugu 30 ఇయర్స్ పృథ్వీకి రోడ్డు ప్రమాదం
Prudhvi


హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ క్యాన్సర్ ఆసుపత్రి సమీసంలో ఉన్న వినాయకుడి గుడి దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిపారు. వినాయకుడి గుడి వైపు పృథ్వీరాజ్‌ వెళ్తుండగా ఓ కారు ఢీ కొట్టిందని పేర్కొంటూ ఈ ప్రమాదంలో ఆయన కారు ధ్వంసమైందని తెలిపారు. దీంతో చుట్టుపక్కల జనాలు గుమిగూడారని చెప్పారు. ఈ మేరకు ధ్వంసమైన కారు ఫొటోను షేర్‌ చేసిన పృథ్వీ టీమ్.. ఆయనకు ఏమైనా గాయాలయ్యాయా? అనే విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. దీంతో ఆయన పరిస్థితిపై ఆరా దీస్తున్నారు జనం.

Also Read: బిగ్ బాస్‌లో ఇకపై నో ఎలిమినేషన్.. ఇవీ మేనేజ్‌మెంట్ రూల్స్.. ప్రయోగం సక్సెస్ కావాలే గానీ!!

30 ఇయర్స్ పృథ్వీగా టాలీవుడ్‌లో ఫేమస్ అయిన ఆయన.. గతంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా పనిచేసి ఓ మహిళతో ఆడియో టేపుల వ్యవహారం వెలుగుచూడటంతో తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. అయితే ఈ ఇష్యూలో ఆ వాయిస్ తనదికాదని పృథ్వీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయనకు సంబంధించిన అన్ని విషయాలు జనాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.