యాప్నగరం

పవన్‌ పెళ్లిపై జగన్ కామెంట్ చేస్తే.. రోజా సీడీ బయటకు తీస్తారట: కమెడియన్ పృథ్వీ

‘రాజకీయాల్లోకి వచ్చిన తరువాత వ్యక్తిగత జీవితాలను గురించి మాట్లాడటం సహజం. మహాత్మా గాంధీ దగ్గర నుండి పవన్ కళ్యాణ్, జగన్‌ల వరకూ అందర్నీ విమర్శిస్తూనే ఉంటారు. రాజకీయాల్లోకి వచ్చాక వ్యక్తిగత జీవితాలు అవన్నీ కుదరవు.

Samayam Telugu 29 Dec 2018, 2:10 pm
రాజకీయాల్లోకి వచ్చాక వ్యక్తిగత జీవితాలు అంటే కుదరవన్నారు కమెడియన్ పృథ్వీ. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా అడుగులువేస్తున్న ఆయన ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జగన్ గతంలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లుపై చేసిన కామెంట్స్‌ని సమర్ధించారు.
Samayam Telugu Comedian Prudhvi, YCP MLA Roja


పృథ్వీ మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లోకి వచ్చిన తరువాత వ్యక్తిగత జీవితాలను గురించి మాట్లాడటం సహజం. మహాత్మా గాంధీ దగ్గర నుండి పవన్ కళ్యాణ్, జగన్‌ల వరకూ అందర్నీ విమర్శిస్తూనే ఉంటారు. రాజకీయాల్లోకి వచ్చాక వ్యక్తిగత జీవితాలు అవన్నీ కుదరవు. సోషల్ మీడియా యాక్టివ్ అయిన తరువాత అందరి జీవితాలు ప్రజల ముందుంటున్నాయి. మన చరిత్ర మొత్తం వాళ్లకు తెలుసు. నువ్ అటువంటి వాడవు.. నువ్ ఇటువంటి వాడవు అని మా నాయకుడు జగన్‌ని అంటే ఆయన తిరిగి ఒక మాట మాట్లాడారు. దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. నా వ్యక్తిగత జీవితం విమర్శించడానికి లేదు అంటే కుదరదు.


అంతెందుకు మా పార్టీ మహిళా నాయకురాలు రోజా గారు ఉన్నారు. ఆవిడను గ్రంధం దేవి అంట ఎవరో బెదిరిస్తున్నారు. బెంగుళూరు నుండి అప్పుడప్పుడు వీడియోలు పెడుతుంటుంది. రోజా గారి సీడీలు మొత్తం నా దగ్గర ఉన్నాయి బయట పెడతా అంటుంది. ఆమె భాష ఏంటో నాకు అర్ధం కావడం లేదు. ఇలా చాలా మంది ఉంటారు. వాళ్లని వాళ్లని ఎంతమందినని ఎదుర్కొంటా. మాట్లాడుకునే వాళ్లు అలా మాట్లాడుతూనే ఉంటారు. ఫైనల్‌గా ప్రజన తీర్పు ఏంటి అన్నదే ముఖ్యం’ అన్నారు పృథ్వీ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.