యాప్నగరం

అమ్మ ఇలా చేస్తుందనుకోలేదు: పృధ్వీరాజ్ తనయుడు

'థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ' అనే డైలాగ్‌తో తనకంటూ ఓ ఫేమ్ సంపాదించుకున్న కమెడియన్ పృధ్వీరాజ్ విడాకుల....

Samayam Telugu 29 Jun 2017, 6:17 pm
'థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ' అనే డైలాగ్‌తో తనకంటూ ఓ ఫేమ్ సంపాదించుకున్న ప్రముఖ హాస్యనటుడు పృధ్వీరాజ్ విడాకుల వివాదంపై ఆయన చిన్న కొడుకు శ్రీనివాస్ స్పందించారు. "గత ఏడాది కాలంగా అమ్మా-నాన్నల మధ్య మనస్పర్ధలు వున్న మాట వాస్తవమే కానీ పరిస్థితి మరీ ఇలా చేయి దాటిపోతుంది అని అనుకోలేదని, అమ్మ ఇలా చేస్తుందని నాన్న కూడా ఊహించలేదు'' అని విచారం వ్యక్తంచేశారు శ్రీనివాస్.
Samayam Telugu comedian prudhvirajs son srinivas reacts about his parentss divorce
అమ్మ ఇలా చేస్తుందనుకోలేదు: పృధ్వీరాజ్ తనయుడు


" గత ఏడాది కాలంగా ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేదు. అమ్మా, నాన్న, అక్క, అన్నయ్య, తాను.. ఇలా అందరం డిస్టర్బ్‌డ్ గానే వున్నాం. నాన్న కూడా మళ్లీ పరిస్థితి సద్దుమణుతుందనే భావించారు కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. అమ్మని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారు. అంతకుమించి ఇందులో ఇంకేం లేదు. నాన్న ఇప్పుడిప్పుడే కెరీర్‌లో ఎదుగుతున్నారు అని అనుకునే స్టేజ్‌లో ఇలా కుటుంబకలహాలు రచ్చకెక్కడం బాధగా వుంది. నాన్నను నా చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను... ఆయన ఎంతో కష్టపడి పైకొచ్చారు. ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న సమయంలో ఆయనపై ఆరోపణలు రావడం బాధగా వుంది" అని ఆవేదన వ్యక్తంచేశారు శ్రీనివాస్.

పృధ్వీరాజ్‌పై విడాకుల కేసు పెట్టిన ఆయన భార్య శ్రీలక్ష్మి.. ఆయన నుంచి తనకి నెలకి రూ.10 లక్షలు భరణం ఇప్పించాల్సిందిగా విజయవాడ ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించడం.. ఆమె ఫిర్యాదుపై స్పందించిన కోర్టు, పృధ్వీరాజ్ నెలకి రూ. 8 లక్షలు ఆమెకి భరణం చెల్లించాల్సిందిగా తీర్పు ఇవ్వడం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.