యాప్నగరం

అజ్ఞాతం వీడి పోలీసుల అదుపులోకి: వనితారెడ్డి

హాస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసు ట్విస్ట్‌లతో సాగుతోంది. తాజాగా విజయ్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె భార్య వనితారెడ్డి బుధవారం జూబ్లీహిల్స్ పోలీసుల ముందు లొంగిపోయారు.

TNN 27 Dec 2017, 5:00 pm
హాస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసు ట్విస్ట్‌లతో సాగుతోంది. తాజాగా విజయ్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె భార్య వనితారెడ్డి బుధవారం జూబ్లీహిల్స్ పోలీసుల ముందు లొంగిపోయారు. విజయ్‌ సాయి చనిపోయే ముందు రికార్డుచేసిన‌ సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు ఆమెతో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదుచేయడంతో పాటు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లి పోలీసులకు దొరక్కుండా విజయ్ సాయిపై పలు ఆరోపణలు చేస్తూ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేసి హాట్ టాపిక్‌గా మారింది.
Samayam Telugu comedian vijay sai wife vanitha reddy surrendered
అజ్ఞాతం వీడి పోలీసుల అదుపులోకి: వనితారెడ్డి


అయితే తాను ఇన్నాళ్లూ అజ్ఞాతంలో ఉన్నది కేవలం ఆధారాలు సేకరించడానికి మాత్రమే అని.. అందరూ అనుకున్నట్లు విజయ్ సాయి తనవల్లే చనిపోయాడనేది పూర్తిగా అవాస్తవం అని తాను సేకరించిన ఆధారాలను పోలీసులకు అప్పగించేందుకే ఈరోజు పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు తెలిపారు వనితారెడ్డి.

ఇక విజయ్ సాయి సెల్ఫీ వీడియోపై స్పందిస్తూ.. అందులో అన్నీ అవాస్తవాలే చెప్పాడని, తల్లిదండ్రులు వేధింపుల వల్ల అతను చనిపోతే అతను నా పేరు ఎందుకు చెప్పాడో తెలియదని.. నేను అతడికి మూడేళ్లుగా దూరంగా ఉంటున్నానన్నారు. ఇక విజయ్‌ ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఇప్పటికే మీడియాకు ఇచ్చానని.. అతడి నిజస్వరూపం ఏంటో తాను పోలీసులకు ఇచ్చే సాక్ష్యాలతో తెలుస్తుందంటున్నారు వనితారెడ్డి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.