యాప్నగరం

శ్రీదేవి మృతిపై కాంగ్రెస్ ట్వీట్.. మండిపడ్డ నెెటిజన్లు

శ్రీదేవి మృతిపై యావత్ దేశం, సినీ అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఆమెకు నివాళులర్పిస్తున్నారు. అయితే శ్రీదేవి మరణంపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదంగా మారింది.

TNN 25 Feb 2018, 11:04 am
శ్రీదేవి మృతిపై యావత్ దేశం, సినీ అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఆమెకు నివాళులర్పిస్తున్నారు. అయితే శ్రీదేవి మరణంపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదంగా మారింది. ఆమె మృతి పట్ల చింతిస్తున్నామని... ఆమె గొప్ప నటి... శ్రీదేవికి మా సంతాపాన్ని తెలియజేస్తున్నామని ట్వీట్ చేశారు. కాని చివర్లో యూపీఏ హయాంలో... ఆమెకు 2013లో పద్మ శ్రీ దక్కిందని కాంగ్రెస్ ప్రస్తావించింది.
Samayam Telugu congress tweets as sridevi got padma shri under upa deletes after massive trolling
శ్రీదేవి మృతిపై కాంగ్రెస్ ట్వీట్.. మండిపడ్డ నెెటిజన్లు



ఇప్పుడిదే వివాదంగా మారింది. పద్మ శ్రీ విషయంలో కాంగ్రెస్ చేసిన ప్రస్తావనపై నెటిజన్లు మండిపడ్డారు. శ్రీదేవి మరణాన్ని కూడా ఇలా రాజకీయం కోసం వాడుకుంటారా అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఇలా విమర్శలు రావడంతో చివరికి... కాంగ్రెస్ ఈ ట్వీట్‌లో యూపీఏ హయాంలో ఆమెకు అవార్డు దక్కిందన్న విషయాన్ని తొలగించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.