యాప్నగరం

నా బ్లడ్ బదర్స్ ఇకలేరు.. ఒకేరోజు ఇద్దరూ.. చిరంజీవి తీవ్ర భావోద్వేగం

మెగా అభిమానులు ఇద్దరు ఒకేరోజు కరోనా బారిన పడి మరణించడంతో భావోద్వేగానికి గురయ్యారు మెగాస్టార్ చిరంజీవి. కదిరి వ్యాస్తవ్యులు ప్రసాద్‌ రెడ్డిగారు, హైదరాబాద్ వాసి వెంకటరమణ గారు కరోనా బారిన పడి కన్నుమూశారు.

Samayam Telugu 21 Apr 2021, 6:57 pm
కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. నిన్నటి వరకూ ఆరోగ్యంగా మన కళ్ల ముందు కనిపించిన వారు ఈ రాకాసి కరోనా వల్ల కనుమరుగైపోతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందర్నీ చుట్టుముట్టేస్తుంది మాయదారి కరోనా. కొన్ని వేల కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్న ఈ కరోనా.. సినిమా ఇండస్ట్రీని వదల్లేదు. ఈ కరోనా ప్రభావంతో చాలా మంది సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మంది కరోనా బారిన పడ్డారు.
Samayam Telugu చిరంజీవి
chiranjeevi tweets


ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి తన అత్యంత ఆత్మీయుల్ని కోల్పోవడంతో భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నో ఏళ్లుగా తనని ఆదిరిస్తూ.. అభిమానిస్తున్న ఇద్దరు ఆప్తుల్ని ఒకేసారి కోల్పోవడంతో తీవ్ర విషాదంలో ఉన్నారు చిరంజీవి. తన బ్లడ్ బ్రదర్స్‌ని కోల్పోయానంటూ ట్విట్టర్ ద్వారా బాధని తెలియజేశారు చిరంజీవి.

‘‘ఎంతో కాలంగా అభిమానులు, అన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే నా బ్లడ్ బ్రదర్స్ కదిరి వాస్తవ్యులు ప్రసాద్ రెడ్డి గారు, హైదరాబాద్ వాసి వెంకటరమణ గారు కరోనా బారిన పడి,ఇక లేరనే వార్త నా హృదయాన్ని కలచివేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలి. వారిరువురి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి’’ అంటూ తన బాధను పంచుకున్నారు చిరంజీవి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.