యాప్నగరం

కరోనా కష్టం.. పెద్ద మనసు చాటుకున్న రోజా

మన ఇంట్లో మనం ఉండటమే కరోనా నివారణకు మార్గం.. అదే సందర్భంలో మన తిండి మనమే తిని పడుకోవడం కాకుండా తిండిలేక ఆకలితో అలమటిస్తున్న పేదలకు సాయం చేసే సమయం ఆసన్నమైంది.

Samayam Telugu 26 Mar 2020, 12:36 pm
కరోనా ప్రభావంతో సినిమా ఇండస్ట్రీకి కోలుకోలేని పెద్ద తగిలింది. షూటింగ్‌ బంద్ కావడంతో చాలా మంది నటీనటులు ఇంటికే పరిమితం అయ్యారు. అయితే ఇండస్ట్రీనే నమ్ముకుని ఉన్న వేలాది మంది శ్రామికులు, కళాకారులు పనుల్లేక తిండికోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏరోజు ఆ రోజు పనిచేసుకుని కుటుంబాన్ని పోషించుకునే సినీ కార్మికులు చాలా మంది పరిస్థితి దయనీయంగా తయారైంది. అయితే ఇలాంటి వాళ్లను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు సినీనటి, నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా. పేదకళాకారుల ఆకలి తీర్చేందుకు 100 బస్తాల బియ్యాన్ని విరాళంగా ప్రకటించారు.
Samayam Telugu roja
రోజా విరాళం


అంతేకాదు కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న ప్రభుత్వానికి సహాయపడేందుకు త్వరలో జోలె పట్టి విరాళాలు సేకరించేందుకు ఆలోచన ఉన్నారట రోజా. ఇలాంటి కరువు పరిస్థితుల నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీనే నమ్ముకున్న తమని దాతలు ఆదుకోవాలంటున్నారు పేద కళాకారులు. సినిమాల ద్వారా కోట్లు కోట్లు సంపాదించిన స్టార్ హీరోలు, బడా దర్శకులు, నిర్మాతలు కరోనాపై రూపాయి ఖర్చులేకుండా ట్విట్టర్‌లో ఓ ట్వీట్ పెట్టిన వదిలేయకుండా పేదలకు సాయం చేసి వాళ్ల ఆకలి తీర్చడానికి ముందుకు రావాలని కోరుకుందాం. ఒక్కో సెలబ్రిటీ కనీసం పదిమంది పేద కళాకారులకు సాయం చేసినా.. ఫిల్మ్ నగర్ నుండి ఆకలి కేకలు వినిపించవు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.