యాప్నగరం

హీరో రాజ్ తరుణ్ తండ్రికి మూడేళ్ల జైలు శిక్ష

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ తండ్రికి మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.

Samayam Telugu 21 Apr 2018, 11:23 am
నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం పొందిన కేసులో సినీ నటుడు రాజ్ తరుణ్ తండ్రి నిడమర్తి బసవరాజుకు కోర్టు మూడేళ్ల శిక్ష విధించింది. వైజాగ్‌లోని వేప గుంటకు చెందిన 53 ఏళ్ల బసవరాజు సింహాచలం ఎస్‌బీఐలో స్పెషల్‌ అసిస్టెంట్‌ క్యాషియర్‌గా విధులు నిర్వహించేవారు. 2013లో తన భార్య రాజ్యలక్ష్మితో పాటు మరి కొందరు వ్యక్తుల పేరిట నకిలీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.9.85 లక్షల రుణం తీసుకున్నారు.
Samayam Telugu raj tarun


బ్యాంకు అధికారుల తనిఖీల్లో నకిలీ బంగారం బయటపడింది. దీంతో బ్యాంకు మేనేజర్‌ గరికిపాటి సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు అప్పట్లో గోపాలపట్నం సీఐ ఈదుల నరసింహారావు కేసు నమోదు చేశారు. కేసును విచారించిన మెట్రోపాలిటన్‌ కోర్టు బసవరాజుకు మూడేళ్ల జైలు, రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.