యాప్నగరం

Daggubati Family: కరోనా కష్టం.. భారీ విరాళం ప్రకటించిన దగ్గుబాటి ఫ్యామిలీ

కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా సినీ పరిశ్రమకు చెందిన రోజువారీ వేతన కార్మికులకు టాలీవుడ్ స్టార్స్ భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఈ తరుణంలో కోటి రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించింది దగ్గుబాటి ఫ్యామిలి

Samayam Telugu 28 Mar 2020, 12:40 pm
కరోనా వైరస్ నిర్మూలనకు, తిండిలేక ఇబ్బందుల పడుతున్న వారికి సాయం చేసేందుకు టాలీవుడ్ నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కొండంత కష్టంలో తమకు చేతనైన సాయం చేస్తూ చేయూతగా నిలుస్తున్నారు టాలీవుడ్ సెలబ్రిటీలు. ఇప్పటికే చిరంజీవి, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో పాటు మిగిలిన హీరోలు దర్శకులు, నిర్మాతలు తమకు తోచిన సాయం చేస్తూ ఆపదలో మేం ఉన్నాం అంటూ అండగా నిలుస్తున్నారు.
Samayam Telugu Covid19 crisis in Tollywood
కరోనా వైరస్.. దగ్గుబాటి ఫ్యామిలీ భారీ విరాళం


తాజాగా దగ్గుబాటు ఫ్యామిలీకి చెందిన వెంకటేష్, సురేష్ బాబు, రానాలు తమ వంతుగా కోటి రూపాయిల సాయం ప్రకటించారు. సినీ కార్మికులు, హెల్త్ కేర్ విభాగాలకు సంబంధించిన కోటి రూపాయల సాయాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో విరాళంగా ప్రకటించారు. కరోనా ప్రభావంతో సినిమా పరిశ్రమలోని కార్మికులు రోజువారి అవసరాలకోసం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ సాయాన్ని ప్రకటించింది సురేష్ ప్రొడక్షన్స్.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని చిత్రాల షూటింగ్స్ ఆగిపోవడంతో పాటు.. లాక్ డౌన్‌తో థియేటర్స్ అన్నీ మూతబడ్డాయి దీంతో వేలాది మంది కార్మికులు, కళాకారులు తిండిలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో వాళ్లకు అండగా నిలుస్తూ.. సురేష్ బాబు, వెంకటేష్, రానా దగ్గుబాటి సినిమా, హెల్త్‌కేర్ రంగాల్లోని కార్మికుల కోసం భారీ మొత్తాన్ని ప్రకటించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరింది దగ్గుబాటి ఫ్యామిలీ.

Read Also: ‘కరోనా’ కష్టం.. విరాళాల ఫుల్ లిస్ట్, ప్రభాస్ 3 కోట్లు హయ్యెస్ట్..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.