యాప్నగరం

Rashmika Mandanna నెక్ట్స్ మూవీపై అప్‌డేట్.. హ్యాట్రిక్‌పై కన్నేసిన బ్యూటీ!

Rashmika Mandanna Next Movie పై అప్‌డేట్ వచ్చేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్, రణబీర్ కపూర్‌తో సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తనని తెలుగులో పరిచయం చేసిన డైరెక్టర్‌తో మూడో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఈ మేరకు కథా చర్చలు కూడా...

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 20 Jan 2023, 2:56 pm

ప్రధానాంశాలు:

  • రష్మిక మందన నెక్ట్స్ మూవీపై అప్‌డేట్
  • వెంకీ కుడుములతో మూడోసారి వర్క్ చేయబోతున్న బ్యూటీ
  • ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో రెండు పెద్ద సినిమాలు
  • మార్చిలో సెట్స్‌పైకి వెళ్లబోతున్న నె్క్ట్స్ మూవీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rashmika Mandanna next Movie
Rashmika Mandanna (రష్మిక మందన)
నేషనల్ క్రష్ రష్మిక మందన (National Crush Rashmika Mandanna) వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవల తమిళ్ హీరో విజయ్‌తో కలిసి ఆమె నటించిన వారీసు సినిమా సంక్రాంతికి రిలీజైంది. తెలుగులో వారసుడు పేరుతో రిలీజైన ఈ మూవీ వారం వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకి పైగా వసూళ్లని రాబట్టింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీలో రష్మిక పాత్ర చాలా పరిమితం. కానీ.. స్క్రీన్‌పై కనిపించినంత సేపు ప్లెజంట్‌గా అనిపించింది. ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా.. దిల్ రాజు ప్రొడ్యూసర్.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌కి ఎదిగిపోయిన రష్మిక మందన (Rashmika Mandanna).. సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్ను మూవీలో నటించింది. ఈ సినిమా శుక్రవారం (జనవరి 20) నేరుగా ఓటీటీలో రిలీజైంది. అలానే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్‌తో ఓ సినిమాలో నటిస్తున్న రష్మిక మందన.. అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప మూవీ సీక్వెల్ ‘పుష్ప: ది రూల్’లో కూడా యాక్ట్ చేస్తోంది. ఈ రెండు మూవీలు చేతిలో ఉండగానే తాజాగా ఆమె నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై క్రేజీ అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది.

Jr NTR: ఆస్కార్ రేసులో ఎన్టీఆర్‌కు అగ్రస్థానం.. టాప్-10 లిస్ట్ ప్రకటించిన మరో యూఎస్ వార్తా సంస్థ
తెలుగులో తనని పరిచయం చేసిన వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో రష్మిక మందన ఒక సినిమా చేయనుందట. 2018లో రిలీజైన ఈ మూవీలో నాగశౌర్యకి జోడీగా రష్మిక మందన నటించింది. ఈ సినిమా హిట్ అవడంతో ఆ తర్వాత వరుస అవకాశాలు చేజిక్కించుకున్న ఈ బ్యూటీ.. పుష్ప మూవీతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. మధ్యలో వెంకీ కుడుములతో భీష్మ సినిమాలో కూడా రష్మిక మందన యాక్ట్ చేసింది. నితిన్ హీరోగా చేసిన ఈ మూవీ కూడా హిట్ అయ్యింది.

Rajamouli: డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నా.. రాజమౌళి కామెంట్స్ వైరల్
ఇటీవల రష్మిక మందనని కలిసిన డైరెక్టర్ వెంకీ కుడుముల కథ చెప్పగా.. మూవీ చేసేందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. మార్చిలో సెట్స్‌పైకి వెళ్లబోతున్న ఈ మూవీలో హీరోగా నితిన్ నటించబోతున్నాడని.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఛలో, భీష్మతో హిట్ అందుకున్న రష్మిక మందన- వెంకీ కుడుముల కాంబినేషన్ హ్యాట్రిక్ కొడుతుందేమో చూడాలి.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.