మహానటి సావిత్రి అంటే దాసరికి ఎనలేని అభిమానం. తన కెరీర్ మొదట్లోనే ఆయన ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, ఎస్వీఆర్, శోభన్ బాబు వంటి పెద్ద నటులతో సినిమాలు తీశారు. వారిలో సావిత్రితో ఆయనకు విడదీయలేని బంధం ఉంది. పలుమార్లు ఆయన సావిత్రిపై ఉన్న అభిమానాన్ని చెప్పారు. తాను సావిత్రిని అక్కా అని పిలుస్తానని , ఆమె తనని తమ్ముడూ అని ప్రేమగా పిలుస్తారని తెలిపారు. మొదటిసారి వింతకాపురం అనే సినిమాలో చేస్తున్నప్పుడు ఆమెను చూశానని, ఆ సినిమా సెట్లోనే తొలిసారి మాట్లాడానని చెప్పారు. అప్పట్నించి రోజూ సావిత్రిని పలకరించేవాడినని చెప్పారు. ఆమె అప్పట్లోనే ఆర్ధికంగా బాగా చితికిపోయారని, తన కష్టాలన్నీ చెప్పుకునేవారని తెలిపారు. అందుకే తాను చేసే సినిమాల్లో సావిత్రికి కచ్చితంగా ఒక పాత్ర ఇచ్చే వాడినని, అలా 15 సినిమాలలో అవకాశం ఇచ్చానని వివరించారు.
ఆమె ఆఖరు రోజుల్లో చాలా సమస్యలు ఎదుర్కొన్నారని, తాను కొన్ని సార్లు ఆర్ధిక సాయం కూడా అందించానని చెప్పారు. మే నాలుగో తేదీన తన పుట్టిన రోజని... 1981లో బర్త్ డే నాడు సావిత్రి మెడలోని బంగారు గొలుసుని తీసి తనకు బహుమతిగా ఇచ్చారని పలుమార్లు గుర్తు చేసుకున్నారు దాసరి. ఆ తరువాత సావిత్రి బెంగళూరు వెళ్లిపోయారని... కొన్ని రోజులకే కాలుజారి కిందపడడం, ఆసుపత్రి పాలవ్వడం జరిగాయని తెలిపారు. కొన్ని రోజులకే ఆమె పరలోకానికి వెళ్లిపోయారని, అక్కయ్య మరణం తనను తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు. సావిత్రి ఉన్నా లేకున్నా... తానెప్పుడు అక్కయ్యని తలచుకుంటానని చెప్పారు.
ఆమె ఆఖరు రోజుల్లో చాలా సమస్యలు ఎదుర్కొన్నారని, తాను కొన్ని సార్లు ఆర్ధిక సాయం కూడా అందించానని చెప్పారు. మే నాలుగో తేదీన తన పుట్టిన రోజని... 1981లో బర్త్ డే నాడు సావిత్రి మెడలోని బంగారు గొలుసుని తీసి తనకు బహుమతిగా ఇచ్చారని పలుమార్లు గుర్తు చేసుకున్నారు దాసరి. ఆ తరువాత సావిత్రి బెంగళూరు వెళ్లిపోయారని... కొన్ని రోజులకే కాలుజారి కిందపడడం, ఆసుపత్రి పాలవ్వడం జరిగాయని తెలిపారు. కొన్ని రోజులకే ఆమె పరలోకానికి వెళ్లిపోయారని, అక్కయ్య మరణం తనను తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు. సావిత్రి ఉన్నా లేకున్నా... తానెప్పుడు అక్కయ్యని తలచుకుంటానని చెప్పారు.