యాప్నగరం

మీడియాలో చీడపురుగులు వారే.. దాసరి కామెంట్స్

సంచలన కామెంట్స్‌కి కేరాఫ్ అడ్రస్‌యైన దర్శకరత్న దాసరి నారాయణ రావు తనదైన శైలిలో ఓ వర్గం మీడియాపై విరుచుకుపడ్డారు.

TNN 5 Jan 2017, 8:25 pm
సంచలన కామెంట్స్‌కి కేరాఫ్ అడ్రస్‌యైన దర్శకరత్న దాసరి నారాయణ రావు తనదైన శైలిలో ఓ వర్గం మీడియాపై విరుచుకుపడ్డారు. మీడియా కొందరికి మాత్రమే చుట్టంలా పనిచేస్తోందని, సినిమాలకు రేటింగ్‌లను ఇచ్చే విషయంలో బ్లాక్ మెయిలింగ్‌కి పాల్పడుతోందంటూ సంచలన వ్యాఖ్యలను చేశారు.
Samayam Telugu dasari narayana rao comments on review ratings
మీడియాలో చీడపురుగులు వారే.. దాసరి కామెంట్స్


దాసరి మిగతా విషయాల్లో ఎలాఉన్నా చిన్న సినిమాలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. గతంలో కూడా చిన్న సినిమాలు ఆదరణను కోల్పోతున్నాయని పలు సందర్భాలలో ఇండస్ట్రీ పెద్దల్ని బహిరంగంగానే విమర్శించారు.

తాజాగా చిన్న సినిమాగా విడుదలై హిట్ చిత్రంగా నిలిచిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన దాసరి ‘ఈ సినిమాలకు మీడియా సపోర్ట్ చేయడం ఆనందంగా ఉంది. ఐతే మీడియాలోనూ ఒకట్రెండు చీడపురుగులు ఉన్నాయి.

వారు డబ్బుల కోసం మంచి సినిమాలను కూడా బాలేదని ప్రచారం చేస్తున్నారని దాంతో ఎంతో మంది జీవితాలు రోడ్డున పడున్నాయంటూ వాపోయారు. ఎంత డబ్బు ఎక్కువ ఇస్తే అంత రేటింగ్ అన్న స్థాయికి దిగజారారని, చివరికి బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. ఇలాంటి వాటిని ఎంతో కాలం భరించలేరు. మంచి సినిమాలను సినిమాకు సహకారం అందించేందుకు త్వరలోనే గుడ్ ఫిల్మ్ ప్రమోటర్స్ పేరుతో ఆరుగురితో ఒక టీం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

మీడియా రాతలు బాధ్యతతో రాయాలి. రేటింగులివ్వాలి. ముఖ్యంగా ఓవర్సీస్ లో రేటింగ్స్ ప్రభావం ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి. నేనీ విషయాన్ని సదుద్దేశంతోనే చెబుతున్నా’’అంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. నారా రోహిత్ మంచి సినిమాని ఇండస్ట్రీకి అందించారని ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా అద్భుతంగా ఉందంటూ చిత్ర యూనిట్‌ని అభినందించారు దాసరి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.