యాప్నగరం

అశ్రునయనాల మధ్య దాసరి అంత్యక్రియలు పూర్తి

దర్శకధీరుడు దాసరి నారాయణ రావు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి.

TNN 31 May 2017, 3:48 pm
దర్శకధీరుడు దాసరి నారాయణ రావు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. అతని పెద్ద కొడుకు ప్రభు సాంప్రదాయబద్ధంగా తండ్రికి తలకొరివి పెట్టారు. వేలాది మంది సాక్షిగా చితికి నిప్పు పెట్టారు. ఫిలిం ఛాంబర్ నుంచి ఆయన అంతిమయాత్ర సాగింది. వందలాది మంది సినీప్రముఖులు, అభిమానులు... యాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. అంతిమయాత్ర వెంబటి పలువురు సినీ అగ్రతారలు కూడా నడిచారు. మొయినాబాద్ లో ఉన్న దాసరి వ్యవసాయ క్షేత్రం పద్మా గార్డెన్స్ వరకు యాత్ర సాగింది. అక్కడే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. దాసరి భార్య పద్మ సమాధి కూడా అక్కడే ఉంది. 2011లో మరణించిన ఆమెకు ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమాధి పక్కనే దాసరికి చివరి క్రతువులు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. పోలీసులు గౌరవ వందనాన్ని సమర్పించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. దర్శక మహనీయుడికి కడసారి కన్నీటి నివాళి అర్పించేందుకు భారీగా సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, అభిమానులు వ్యవసాయక్షేత్రానికి తరలి వచ్చారు.
Samayam Telugu dasari narayana rao last rites held in his farmhouse in moinabad
అశ్రునయనాల మధ్య దాసరి అంత్యక్రియలు పూర్తి



తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.