దర్శకరత్న దాసరి నారాయణ రావు మృతి వార్త తెలుసుకున్న తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొద్దిసేపటి క్రితమే కిమ్స్ ఆస్పత్రికి చేరుకుని దాసరి భౌతిక కాయానికి నివాళి అర్పించారు. దాసరికి నివాళి అర్పించిన అనంతరం ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడిన మంత్రి తలసాని... దాసరికి తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయినట్టు మంత్రి స్పష్టంచేశారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం రేపు సాయంత్రం 4 గంటలకి హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్లో వున్న దాసరి నారాయణ రావు సొంత ఫామ్ హౌజ్లో దాసరి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం రేపు సాయంత్రం 4 గంటలకి హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్లో వున్న దాసరి నారాయణ రావు సొంత ఫామ్ హౌజ్లో దాసరి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.