యాప్నగరం

‘దేశంలో దొంగలు పడ్డారు’ టీజర్.. మూటలో ఏముందో తెలుసా?

ప్రముఖ హాస్యనటుడు ఆలీ సమర్పణలో సారా క్రియేషన్స్ పతాకంపై వస్తోన్న సినిమా ‘దేశంలో దొంగలు పడ్డారు’. ఆయన తమ్ముడు ఖయ్యూమ్ హీరోగా నటిస్తున్నాడు.

Samayam Telugu 28 Aug 2018, 4:34 pm
ప్రముఖ హాస్యనటుడు ఆలీ సమర్పణలో సారా క్రియేషన్స్ పతాకంపై వస్తోన్న సినిమా ‘దేశంలో దొంగలు పడ్డారు’. ఆయన తమ్ముడు ఖయ్యూమ్ హీరోగా నటిస్తున్నాడు. సమీర్, సీనియర్ నటుడు పృథ్వీ ముఖ్య పాత్రలు పోషించారు. గౌతం రాజ్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. టీజర్ చూస్తుంటే ఓ కిడ్నాప్ చుట్టూ తిరిగే కథలా అనిపిస్తోంది.
Samayam Telugu Trailer


పోలీస్ పాత్ర పోషించిన సమీర్.. ‘మూటలో ఏముంది’ అని ఖయ్యూమ్‌ను గన్‌తో బెదిరించడం, ఆ మూటతో ఖయ్యూమ్ ప్రయాణం, మూటలో అమ్మాయి ఉంది అని లారీ డ్రైవర్‌తో చెప్పడం ఈ సన్నివేశాలన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. చూస్తుంటే ఇదేదో థ్రిల్లర్ మూవీలా ఉంది. వాస్తవానికి ఈ చిత్రం అమెరికాలోని బ్లాక్ బేర్ (మెల్‌ఫోర్డ్) ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. కాగా, రామగౌతమ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంతోష్ డొంకాడ సహ నిర్మాత. శేఖర్ గంగనమోని సినిమాటోగ్రఫీ అందించగా.. సాండీ సంగీతం సమకూర్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.