యాప్నగరం

Allu Arjun: దేవీశ్రీ, తమన్ పోటాపోటీ.. మహేష్, బన్నీ కోసం ఒకే విదేశీ ఆర్కెస్ట్రా

సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. సినీ ప్రేమికులు పెద్ద సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూసేది సంక్రాంతికే. స్టార్ హీరోలు టార్గెట్ చేసేది కూడా సంక్రాంతి సీజన్‌నే. ఈ సారి సంక్రాంతి రేసులో ప్రధానంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో యుద్ధం మొదలైపోయింది.

Samayam Telugu 17 Dec 2019, 7:58 pm
సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. సినీ ప్రేమికులు పెద్ద సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూసేది సంక్రాంతికే. స్టార్ హీరోలు టార్గెట్ చేసేది కూడా సంక్రాంతి సీజన్‌నే. ఈ సారి సంక్రాంతి రేసులో ప్రధానంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో యుద్ధం మొదలైపోయింది.
Samayam Telugu devi sri prasad thaman working with fames project orchestra for their films sarileru neekevvaru ala vaikunthapurramuloo
Allu Arjun: దేవీశ్రీ, తమన్ పోటాపోటీ.. మహేష్, బన్నీ కోసం ఒకే విదేశీ ఆర్కెస్ట్రా


ఒక్కరోజు తేడాలో..

మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ జనవరి 11న విడుదలకు సిద్ధమవుతోంది. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న ‘అల వైకుంఠపురములో’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నిజానికి ఈ రెండు సినిమాలు ఒకే రోజు వస్తున్నట్టు మొదటల్లో ప్రకటించారు. కానీ, ఒకే రోజు వస్తే సినిమా ఓపెనింగ్స్‌పై ప్రభావం పడుతుందని ఇరు చిత్రాల నిర్మాతలు కాంప్రమైజ్ అయ్యి తేదీలు మార్చుకున్నారు.

తెగ కష్టపడుతోన్న సంగీత దర్శకులు

టాలీవుడ్‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతోన్న దేవీశ్రీ ప్రసాద్ ఊపు ఈ మధ్య కాస్త తగ్గింది. మరోవైపు ఎస్. తమన్ దూసుకొస్తున్నారు. ఈ మధ్య కాలంలో మంచి ఆల్బమ్స్ ఇస్తూ స్టార్ హీరోలు, దర్శకులను ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు దేవీశ్రీ.. ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాల ఆల్బమ్స్ నుంచి కొన్ని పాటలు విడుదలయ్యాయి. దేవీ అందించిన పాటల కంటే తమన్ సాంగ్స్‌కే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మిగిలిన పాటలు, నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఇవ్వాలని ఇప్పుడు ఈ ఇద్దరు సంగీత దర్శకులు తెగ కష్టపడుతున్నారు.

ఒకే విదేశీ ఆర్కెస్ట్రాతో ఇద్దరూ..

యూరప్‌‌కు చెందిన ఫేమ్స్ ప్రాజెక్ట్ ఆర్కెస్ట్రాతో కలిసి ప్రస్తుతం దేవీ, తమన్ పనిచేస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ ఇప్పటికే యూరప్ వెళ్లి ఫేమ్స్ ప్రాజెక్ట్ ఆర్కెస్ట్రాతో రికార్డింగ్ సెషన్ నిర్వహించారు. అయితే, అక్కడ ఏం రికార్డ్ చేశారు అనేది సస్పెన్స్. త్వరలోనే పాట రూపంలో ప్రేక్షకులకు వినిపించనున్నారు. మరోవైపు ఇదే ఆర్కెస్ట్రాతో తమన్ ‘సరిలేరు నీకెవ్వరు’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను రికార్డు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Sing The Song: 'హీజ్ సో క్యూట్ తెలుగు లిరికల్ సాంగ్‌... అబ్బాయి అందం మీద ఒక్కపాట లేదే' అందుకేనా

Twitter-THANKU ALL 4 makin #HeIsSoCute an Instant Chartbus...

Twitter-#AlaVaikunthapurramloobgmworks With #70peiceorche...

ఫేమ్స్ ప్రాజెక్ట్ ఆర్కెస్ట్రా ఇదే ఫస్ట్ టైం కాదు

తెలుగు సినిమాలకు ఫేమ్స్ ప్రాజెక్ట్ ఆర్కెస్ట్రా పనిచేయడం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే పలు సినిమాలకు ఈ ఆర్కెస్ట్రా పనిచేసింది. ఇటీవల కాలంలో ‘గ్యాంగ్ లీడర్’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలకు ఈ ఆర్కెస్ట్రా పనిచేసింది. ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలతో పాటు ఐదు భాషల్లో వస్తోన్న కన్నడ సినిమా ‘అతడే శ్రీమన్నారాయణ’కు కూడా పనిచేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సినిమాలు, టీవీ షోలు, వీడియో గేమ్స్‌కు పనిచేసిన ఈ ఆర్కెస్ట్రాకు ప్రస్తుతం ఇండియాలోనూ డిమాండ్ పెరిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.