యాప్నగరం

‘దేవుళ్లు’ బాలనటి నిత్యా శెట్టి ఇప్పుడు ఇలా..!

‘చిన్ని చిన్ని ఆశ’ సినిమాతో నిత్యా శెట్టి బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైంది. తొలి చిత్రంతోనే నంది అవార్డును గెలుచుకుంది.

Samayam Telugu 7 Aug 2018, 6:25 pm
‘చిన్ని చిన్ని ఆశ’ సినిమాతో నిత్యా శెట్టి బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైంది. తొలి చిత్రంతోనే నంది అవార్డును గెలుచుకుంది. ‘దేవుళ్లు’ చిత్రంతో బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిత్య.. ‘లిటిల్ హార్ట్స్’ చిత్రానికి కూడా నంది అవార్డు సొంతం చేసుకుంది. ఆ తరవాత 15 ఏళ్లు సినిమాలకు టాటా చెప్పి చదువు మీద ధ్యాస పెట్టింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిపోయింది. అయితే 2015లో మళ్లీ టాలీవుడ్ ఆమె తలుపు తట్టింది.
Samayam Telugu Nithay


Click Here: నిత్యా శెట్టి మరిన్ని ఫొటోలు

రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ‘దాగుడుమూత దండాకోర్’ చిత్రంలో హీరోయిన్‌గా నిత్యకు అవకాశం వచ్చింది. ఆ తరవాత ‘పడేసావే’ సినిమాలో నటించింది. ప్రస్తుతం హీరోయిన్‌గా గుర్తింపు కోసం నిత్య ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా హైదరాబాద్‌లో జరిగిన సంతోషం అవార్డ్స్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో నిత్య పాల్గొంది. ఈ సందర్భంగా కెమెరాలకు పోజులిచ్చింది. ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.