యాప్నగరం

బిగుస్తున్న ఉచ్చు.. నటుడి హత్యలోనూ దిలీప్ ప్రమేయం?

పోలీస్ కస్టడీలో ఉన్న మలయాళ నటుడు దిలీప్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తన అక్రమ సంబంధం వ్యవహారాన్ని బయట

TNN 13 Jul 2017, 12:20 pm
పోలీస్ కస్టడీలో ఉన్న మలయాళ నటుడు దిలీప్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తన అక్రమ సంబంధం వ్యవహారాన్ని బయట పెట్టిందనే ఈ నటుడు నటీమణి భావనపై దాడి చేయించాడని పోలీసుల విచారణలో తేలినట్టుగా తెలుస్తోంది. అప్పటికే మంజూ వారియర్ ను వివాహం చేసుకున్న దిలీప్ ఆపై తన సహచర నటి కావ్యమాధవన్ తో అక్రమసంబంధాన్ని పెట్టుకున్నాడట. ఈ విషయాన్ని మంజూ వారియర్ కు భావన చేరవేసిందని సమాచారం. దీంతో భావనపై ఆగ్రహించిన దిలీప్ ఆమెపై దాడి చేయించాడని తెలుస్తోంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో దిలీప్ కు మంజూ వారియర్ విడాకులు ఇచ్చింది. కొంత కాలం కిందట దిలీప్ కావ్యమాధవన్ ను పెళ్లి చేసుకున్నాడు.
Samayam Telugu dileep behind kalabhavan manis murder
బిగుస్తున్న ఉచ్చు.. నటుడి హత్యలోనూ దిలీప్ ప్రమేయం?


భావనపై దాడికి సూత్రధారి దిలీప్ కాగా, భావనపై దాడిలో పాత్రధారులు పల్సర్ సునీ, అతడి సన్నిహితులని తెలుస్తోంది. పోలీసులు ఇందుకు సంబంధించి పక్కా ఆధారాలను సమీకరించినట్టుగా సమాచారం. దాడిలో పాల్గొన్న నిందితులను పలు ప్రాంతాలకు తీసుకెళ్లి.. పూర్తి సాక్షాధారాలను రాబట్టే పనిలో ఉన్నారు కేరళ పోలీసులు. ఈ సంగతిలా ఉంటే.. దిలీప్ పై మరిన్ని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

ప్రత్యేకించి మలయాళ ప్రముఖ నటుడు కళాభవన్ మణిని హత్య చేయించింది దిలీపే అనే మాట వినిపిస్తోంది. మణి కుటుంబీకులు ఈ ఆరోపణలను తెరపైకి తెచ్చారు. కొన్నాళ్ల కిందట కళాభవన్ మణి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆయనపై విష ప్రయోగం జరిగినట్టుగా పోలీసులు తేల్చారు. మణి హత్య కేసు ప్రస్తుతం సీబీఐ విచారణలో ఉంది.

ఈ నేపథ్యంలో మణి కుటుంబీకులు మాట్లాడుతూ.. దిలీపే కళాభవన్ ను హత్య చేయించారని అంటున్నారు. మణి తో దిలీప్ కు రియల్ ఎస్టేట్ కు సంబంధించిన గొడవ ఉందని.. దీంతోనే మణిని దిలీప్ హత్య చేయించాడనే ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సీబీఐకు వారు ఫిర్యాదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.