యాప్నగరం

హీరోగారి కేసును రెండు నెలల్లో తేల్చేస్తాం!

నటిని కిడ్నాప్ చేసి వేధించిన కేసులో విచారణను మరో రెండు నెలల్లో పూర్తిచేస్తామని ప్రకటించారు

TNN 14 Sep 2017, 2:09 pm
మలయాళీ నటిని కిడ్నాప్ చేసి వేధించిన కేసులో విచారణను మరో రెండు నెలల్లో పూర్తిచేస్తామని ప్రకటించారు కేరళ పోలీసులు. ఈ మేరకు వారు కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంలో సూత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటున్న మలయాళీ స్టార్ హీరో దిలీప్ ప్రస్తుతం పోలీసులు కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దిలీప్ ను అరెస్టు చేసి అరవై రోజులు దాటిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ ఇంకా ఎంతకాలం కొనసాగిస్తారు? అని పోలీసులను కోర్టు ప్రశ్నించింది.
Samayam Telugu dileep files fresh bail plea
హీరోగారి కేసును రెండు నెలల్లో తేల్చేస్తాం!


పోలీసుల తీరుపై కోర్టు అసంతఈప్తి వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణను సినిమాటిక్ గా చేస్తున్నారని, ఇదేమైనా సినిమా స్క్రిప్ట్ అనుకుంటున్నారా? అని పోలీసులను కోర్టు ప్రశ్నించడం గమనార్హం. నటిపై అపహరణ, దాడి జరిగి ఆరు నెలలు గడిచిపోయాయి అని.. పోలీసులు ఇప్పటికీ విచారణను పూర్తి చేయకపోవడం ఏమిటి? అని కోర్టు ప్రశ్నించింది.

ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసు అధికారులు.. ఈ కేసులో విచారణను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. రాబోయే రెండు నెలల్లో విచారణ పూర్తి అవుతుందని కోర్టుకు తెలిపారు. నిందితులు విచారణకు సహకరించకపోవడం వల్లనే లేట్ అవుతోందన్నారు. ఇదిలా ఉంటే.. దిలీప్ మరోసారి బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశాడు. ఇప్పటికే మూడు సార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరణ అయిన నేపథ్యంలో నాలుగో సారి ఈ హీరో బెయిల్ కోసం అభ్యర్థించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.