‘నీకు అర్థమౌతోందా’?? సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర ట్రైలర్లో ఫేమస్ డైలాగ్ ఇది. హీరోయిన్ రష్మిక.. నీకు అర్థమౌతోందా? అంటూ చేయి అడ్డంగా పెట్టి చెప్తున్న ఈ డైలాగ్ టిక్ టాక్ ఇతర యాప్లలో వైరల్ అవుతోంది. ఇంత పాపులర్ అవుతున్న ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుగా ఉందే అంటూ ఆలోచనలో పడ్డ నెటిజన్లకు అసలు విషయం తెలిసింది.
నీకు అర్థమౌతోందా?? అది వాళ్ల గేమ్ స్ట్రాటజీ ఏమో?? వాళ్లు అంతేనేమో..?? అయ్యో మీకు అర్ధమౌతోందా?? ఈ డైలాగ్స్ సినిమా ఆడియన్స్కి కొత్తేమో కాని.. టీవీ ప్రేక్షకులకు అందులోనూ బిగ్ బాస్ ఆడియన్స్ అంటే.. ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ డైలాగ్స్ అన్నీ బిగ్ బాస్ సీజన్ 2లో రన్నరప్ టైటిల్ కొట్టిన సింగర్ గీతా మాధురివే.
ఇప్పుడు ఈమె ముచ్చట ఎందుకు వచ్చింది అంటే.. మనం సరిలేరు నీకెవ్వరు చిత్రం టైలర్పై ఓ లుక్కేయాలి.
చూశారుగా.. ట్రైలర్లో ‘నీకు అర్ధమౌతోందా?’ అంటూ రష్మిక అతి కష్టంగా పట్టి పట్టి చెప్తున్నట్టుగా ఆమెకు సెట్ కానట్టుగా ఉన్న ఈ డైలాగ్ బిగ్ బాస్లో గీతా మాధురి దగ్గర నుండి ఎత్తుకొచ్చిందే. నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్లో 3లో గీతా మాధురి ఫైనల్ వరకూ వెళ్లి.. కౌశల్కి విన్నర్ టైటిల్ని ఇచ్చేసి.. రన్నరప్తో సరిపెట్టుకుంది. అయితే హౌస్లో ఆమె ఊతపదం ‘నీకు అర్ధమౌతోందా’ మాత్రం బాగా ఫేమస్ అయ్యింది.
అయితే డైలాగ్ను ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో వాడేశారు దర్శకుడు అనీల్ రావిపూడి. ఈ చిత్రంలో మహేష్తో జోడీ కట్టిన రష్మిక.. ‘నీకు అర్ధమౌతోందా’ అంటూ ఈ డైలాగ్ గీతా మాధురిదే అని అందరికీ అర్ధమయ్యేట్టు చెప్తోంది.
నీకు అర్థమౌతోందా?? అది వాళ్ల గేమ్ స్ట్రాటజీ ఏమో?? వాళ్లు అంతేనేమో..?? అయ్యో మీకు అర్ధమౌతోందా?? ఈ డైలాగ్స్ సినిమా ఆడియన్స్కి కొత్తేమో కాని.. టీవీ ప్రేక్షకులకు అందులోనూ బిగ్ బాస్ ఆడియన్స్ అంటే.. ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ డైలాగ్స్ అన్నీ బిగ్ బాస్ సీజన్ 2లో రన్నరప్ టైటిల్ కొట్టిన సింగర్ గీతా మాధురివే.
ఇప్పుడు ఈమె ముచ్చట ఎందుకు వచ్చింది అంటే.. మనం సరిలేరు నీకెవ్వరు చిత్రం టైలర్పై ఓ లుక్కేయాలి.
చూశారుగా.. ట్రైలర్లో ‘నీకు అర్ధమౌతోందా?’ అంటూ రష్మిక అతి కష్టంగా పట్టి పట్టి చెప్తున్నట్టుగా ఆమెకు సెట్ కానట్టుగా ఉన్న ఈ డైలాగ్ బిగ్ బాస్లో గీతా మాధురి దగ్గర నుండి ఎత్తుకొచ్చిందే. నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్లో 3లో గీతా మాధురి ఫైనల్ వరకూ వెళ్లి.. కౌశల్కి విన్నర్ టైటిల్ని ఇచ్చేసి.. రన్నరప్తో సరిపెట్టుకుంది. అయితే హౌస్లో ఆమె ఊతపదం ‘నీకు అర్ధమౌతోందా’ మాత్రం బాగా ఫేమస్ అయ్యింది.
అయితే డైలాగ్ను ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో వాడేశారు దర్శకుడు అనీల్ రావిపూడి. ఈ చిత్రంలో మహేష్తో జోడీ కట్టిన రష్మిక.. ‘నీకు అర్ధమౌతోందా’ అంటూ ఈ డైలాగ్ గీతా మాధురిదే అని అందరికీ అర్ధమయ్యేట్టు చెప్తోంది.