యాప్నగరం

కన్నడ డైరెక్టర్ గురుప్రసాద్ అరెస్ట్.. కోర్టు విచారణకి డుమ్మా

Sandalwood Director Guruprasad అరెస్ట్ బెంగళూరులో చర్చనీయాంశంగా మారింది. గత 17 ఏళ్లుగా కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్న గురుప్రసాద్.. ఓ చెక్ బౌన్స్ కేసులో కోర్టు ఆదేశాల్ని దిక్కరించాడు. దాంతో అతనిపై నాన్‌ బెయిల్‌బుల్ కేసు నమోదవగా.. పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అయితే గంటల వ్యవధిలోనే అతను బెయిల్‌పై విడుదల అయ్యాడు. పదుల సంఖ్యలో సినిమాలు తీసిన గురుప్రసాద్ ఖాతాలో హిట్ మూవీస్ కూడా ఉన్నాయి.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 14 Jan 2023, 8:27 pm

ప్రధానాంశాలు:

  • శాండిల్‌వుడ్ డైరెక్టర్ గురుప్రసాద్ అరెస్ట్
  • చెక్ బౌన్స్ కేసులో కోర్టుకి హాజరవని డైరెక్టర్
  • నాన్‌ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Director Guruprasad arrest
డైరెక్టర్ గురుప్రసాద్
సీనియర్ డైరెక్టర్ గురుప్రసాద్ (Director Guruprasad) అరెస్ట్ కన్నడ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. 2006లో వచ్చిన మఠ సినిమాతో శాండిల్‌వుడ్‌కి పరిచయమైన ఈ దర్శకుడు పదుల సంఖ్యలో అక్కడ సినిమాలు తీశాడు. అయితే.. గిరినగర పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా.. గంటల వ్యవధిలోనే బెయిల్‌పై విడుదల అయ్యాడు. ఇంతకీ అతను చేసిన తప్పు ఏంటంటే? ఓ చెక్ బౌన్స్ కేసులో కోర్టుకి హాజరు కాకపోవడమే.
శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి డైరెక్టర్ గురుప్రసాద్ పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నాడు. కానీ ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వకుండా మాయమాటలు చెప్తూ తప్పించుకు తిరుగుతున్నాడట. దాంతో శ్రీనివాస్ ఇటీవల నిలదీయగా.. ఓ చెక్ ఇచ్చాడట. అయితే.. ఆ చెక్ బ్యాంక్‌‌లో వేయగా.. తగినంత బ్యాలెన్స్ లేకపోవడంతో ఆ చెక్ బౌన్స్ అయ్యింది. దాంతో శ్రీనివాస్ కోర్టుని ఆశ్రయించారు.

విచారణలో భాగంగా డైరెక్టర్ గురుప్రసాద్‌ నేరుగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. కానీ.. సరైన కారణం చెప్పకుండా గురుప్రసాద్ గైర్హాజరయ్యాడు. దాంతో గురుప్రసాద్‌పై కోర్టు నాన్‌ బెయిల్‌‌బుల్ వారెంట్ జారీ చేసింది. దాంతో గిరినగర పోలీసులు గాలించి గురుప్రసాద్‌ని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. అనంతరం అతను బెయిల్‌పై విడుదల అయ్యాడు.

కన్నడ ఇండస్ట్రీ గత ఏడాదికాలంగా పాజిటివ్‌గా వార్తల్లో నిలుస్తోంది. కేజీఎఫ్ -1, 2లతో శాండిల్‌వుడ్‌ పవర్‌ని ప్రశాంత్ నీల్, యశ్ దేశానికి చూపించగా.. కాంతార సినిమాతో రిషబ్ శెట్టి ఆ క్రేజ్‌ని మరింత పెంచాడు. మధ్యలో రక్షిత్ శెట్టి కూడా చార్లీ 777తో సత్తాచాటాడు. అక్కడి నుంచి వెలుగులోకి వచ్చిన హీరోయిన్ రష్మిక మందన ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తోంది.

Read Latest Telugu Movies News , Telugu News
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.