యాప్నగరం

RIP SPB: బాలు గారు ఇక లేరు అనడం తప్పు: కొరటాల శివ

ఎస్పీ బాలు మరణంతో సంగీత ప్రపంచం షాక్‌కి గురైంది. లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం యావత్ సినీ లోకాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది.

Samayam Telugu 25 Sep 2020, 4:55 pm
నా పాటతో పయనం ముగిసింది.. నా గొంతు మూగబోయింది. నా పాట మీ నోట కలకాలమైనా.. సంగీత ప్రపంచానికి ఇక సెలవు అంటూ ఈ లోకం విడిచారు గాన గాంధర్వుడు ఎస్పీ బాలు. మనసుని తాకే పాటల్ని మనకిచ్చి ఆ మహా మనిషి మాయమయ్యారు. స్వర మాంత్రికుడు, తన గానంతో అమృతం పంచే మేటి గాయకుడు బాలు లేరన్న వార్త కోట్లాది మంది సంగీత ప్రియుల్ని కలచివేస్తుంది.
Samayam Telugu బాలు, కొరటాల
SPB RIP


RIP SPB అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. బాలు ఇక లేరు అంటూ వేదన చెందుతున్నారు. ఈ తరుణంలో ‘బాలు గారు ఇక లేరు అనడం తప్పు’ అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ నివాళి తెలిపారు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ.

‘బాలు గారు ఇక లేరు అనటం తప్పు. పాట ఉన్నంత కాలం ఆయన మన మధ్యే ఉంటారు. కాని ఆయన ఇక పాట పాడరు అనే విషయమే జీర్ణించుకోలేని నిజం. గానగంధర్వుడికి శోకతప్త హృదయంతో అశృనివాళులు’ అంటూ ట్వీట్ చేశారు కొరటాల.
ఫోటోస్: గాన‌గంధ‌ర్వుడు వదిలి వెళ్లిన అరుదైన జ్ఞాపకాలు

ఈయనతో పాటు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, త్రివిక్రమ్, రాఘవేంద్రరావు సినీ రాజకీయ ప్రముఖులు బాలు మరణంపై నివాళులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.