యాప్నగరం

hyderabad voters: హైదరాబాద్ ఓటర్లు.. సిగ్గుపడండి: కొరటాల ఫైరింగ్ ట్వీట్

నగరంలో ఊహించని విధంగా ఓటింగ్ శాతం తగ్గడంపై ఘాటుగా స్పందించారు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ.

Samayam Telugu 8 Dec 2018, 12:25 pm
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఓటింగ్ శాతం తగ్గడంపై ఫైర్ అయ్యారు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ. ప్రతి సినిమాలోనూ పౌరుల సామాజిక బాధ్యతను గుర్తు చూస్తూ.. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న దర్శకుడిగా పేరొందిన కొరటాల శివ.. రాజధాని నగరంలో ఊహించని విధంగా ఓటింగ్ శాతం తగ్గడంపై ఘాటుగా స్పందించారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 2.1% తగ్గింది. ఓవరాల్‌గా 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 52.9 శాతం ఓట్లు నమోదు కాగా.. నిన్న జరిగిన ఎన్నికల్లో 50.86 శాతం మాత్రమే నమోదు అయ్యారు. ఈ లెక్కన 2.1 శాతం ఓట్లు తగ్గాయి. దీంతో హైదరాబాద్ ఓటర్లపై మండి పడ్డారు కొరటాల శివ.
Samayam Telugu కొరటాల శివ



‘హైదరాబాద్ ప్రజలకు ఏమైంది? సాయంత్రం 3 అయ్యింది.. పోలింగ్ శాతం కేవలం 35 శాతం మాత్రమే. నగర ఓటర్లు సిగ్గుపడాలి’ అంటూ ఓటు హక్కు వినియోగించుకోని ఓటర్లకు చురకలు అంటిస్తూ.. ఘాటైన వ్యాఖ్య చేశారు. కాగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సెలబ్రిటీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుండే ఓటు హక్కు కోసం క్యూలో నిలబడి మరీ ఓట్లు వేశారు. అక్కినేని నాగార్జున ఉదయం 6 గంటలకే ఓటు హక్కు వినియోగించుకోగా.. మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, శ్రీకాంత్, కొరటాల తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్న వాళ్లలో ఉన్నారు.

నగరంలో ఓటింగ్ శాతం తగ్గడానికి ప్రధాన కారణం..
గురు, శుక్ర, శని, ఆది ఇలా నాలుగు రోజులు వరుస సెలవులు రావడంతో సొంత ఊర్లకు పయనం అయ్యారు. దీనికి తోడు పెద్ద సంఖ్యలో ఓట్లు గల్లంతు కావడం కూడా పోలింగ్ శాతంపై ప్రభావం చూపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.