యాప్నగరం

Sarileru Neekevvaru: కథ రెడీగా ఉంది.. బాల్‌ మహేష్ కోర్ట్‌లోకి నెట్టిన దర్శకుడు

గీత గోవిందం సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న యువ దర్శకుడు పరశురామ్‌, లాంగ్ గ్యాప్‌ తరువాత ఇటీవల కొత్త సినిమాను ప్రారంభించాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లకముందే తన నెక్ట్స్ సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చాడు పరశురామ్‌.

Samayam Telugu 26 Dec 2019, 9:51 am
గీత గోవిందం సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న యువ దర్శకుడు పరశురామ్‌, లాంగ్ గ్యాప్‌ తరువాత ఇటీవల కొత్త సినిమాను ప్రారంభించాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లకముందే తన నెక్ట్స్ సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చాడు పరశురామ్‌.
Samayam Telugu director parashuram clarity on film with mahesh babu
Sarileru Neekevvaru: కథ రెడీగా ఉంది.. బాల్‌ మహేష్ కోర్ట్‌లోకి నెట్టిన దర్శకుడు


గీత గోవిందంతో ఆకట్టుకున్న పరశురామ్

యువత సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన పరశురామ్‌, అల్లు శిరీష్‌ హీరోగా తెరకెక్కిన శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తొలి విషయాన్ని అందుకున్నాడు. తరువాత గీత గోవిందంతో బ్లాక్‌ బస్టర్‌ హిట్ కొట్టి స్టార్ హీరోల దృష్టిలో పడ్డాడు. ఈ సినిమా సక్సెస్‌తో పరశురామ్‌ క్రేజీ డైరెక్టర్‌గా మారిపోయాడు. అదే జోరులో సూపర్‌ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేశాడు. మహేష్‌కు కథ కూడా వినిపించిన పరశురామ్‌, డేట్స్‌ మాత్రం సంపాదించలేకపోయాడు.

నాగ చైతన్యతో సినిమాను ప్రారంభించిన పరశురామ్‌

మహేష్ నుంచి సానుకూల స్పందన రాకపోవటంతో ఇతర హీరోలతో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేశాడు. ప్రభాస్‌, అల్లు అర్జున్‌ లాంటి హీరోలతో పరశురామ్ సినిమా చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అవేవి వర్క్‌ అవుట్‌ కాకపోవటంతో ఫైనల్‌గా నాగచైతన్యతో సినిమాను ప్రారంభించాడు. 14 రీల్స్‌ ప్లస్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

మహేష్‌ మూవీపై క్లారిటీ ఇచ్చిన పరశురామ్‌

తాజాగా విశాఖపట్నం దగ్గరలోని అడివివరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని సతీ సమేతంగా దర్శించుకున్నాడు పరశురామ్‌. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహేష్‌తో చేయబోయే సినిమాకు కథ సిద్ధంగా ఉందన్న పరశురామ్‌, నాగచైతన్య మూవీ పూర్తయిన వెంటనే మహేష్ సినిమాను ప్రారంభిస్తానని తెలిపాడు.

`సరిలేరు నీకెవ్వరు` పనుల్లో బిజీగా ఉన్న మహేష్‌

మహేష్‌ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తరువాత మహేష్ చేయబోయే సినిమా ఏంటన్నది ఇంకా క్లారిటీ రాలేదు. సుకుమార్‌తో సినిమా చేయాల్సి ఉండగా క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ కారణంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.