యాప్నగరం

నాకు పునర్జన్మ ‘గీత గోవిందం’: డైరెక్టర్ పరశురాం

విజయ్ దేవరకొండ, రష్మిక మండాన్నా జోడీగా పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ‘గీత గోవిందం’ ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆదివారం నాడు సక్సెస్ మీట్‌ను నిర్వహించారు.

Samayam Telugu 19 Aug 2018, 9:09 pm
విజయ్ దేవరకొండ, రష్మిక మండాన్నా జోడీగా పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ‘గీత గోవిందం’ ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆదివారం నాడు సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ గ్రాంగ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Samayam Telugu పరశురాం


ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పరుశురాం మాట్లాడుతూ.. ‘గీత గోవిందం’ చిత్ర విజయం నాకు పునర్జన్మ లాంటిది. అద్భుత విజయాన్ని అందించారు ప్రేక్షకులు. ఈ చిత్రం సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి గారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నా. ఈ చిత్రం హిట్ అయిన తరువాత చిరంజీవి గారిని కలిశా. ఆయన చెప్పిన మాటలు నాకు భగవద్గీత లాంటిది. సక్సెస్ వచ్చిన తరువాత ఎలా ఉండాలి అని ఆయన చెప్పిన మాటలు నేను గుండెల్లో రాసి పెట్టుకున్నా.

ఈ కథ గీతా ఆర్ట్స్ వాళ్లు చేయడానికి ముఖ్య కారకులు నిర్మాత బన్నీ వాసు. ఆయనే కథ విని అల్లు అరవింద్, విజయ్ దేవరకొండ గారికి చెప్పారు. మనం ఎదుగుతుంటే కాళ్లు పట్టుకుని లాగేసే సమాజం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ దేవరకొండను ప్రోత్సహిస్తున్న చిరంజీవి గారికి ధన్యవాదాలు’ అంటూ జై మెగాస్టార్ నినాదంతో ప్రసంగాన్ని ముగించారు పరశురామ్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.