యాప్నగరం

మంత్రాలయంలో రాజమౌళీ ప్రత్యేక పూజలు?

గ్రహాల అనుకూలత కోసం పూజలు చేయాలని పండితులు చెప్పడంతో రాజమౌళీ మంత్రాలయంలో గట్టిగా పూజలు చేస్తున్నారని టాలీవుడ్ సమాచారం. ఈ ప్రచారం ఎంత వరకు నిజమనేది రాజమౌళీ స్పందిస్తేనే తెలుస్తుంది.

TNN 16 Jan 2018, 9:52 am
రాజయం ఎరుగని దర్శకధీరుడు రాజమౌళీకి రానున్న రోజుల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురుకానున్నాయా? అందుకే ఆయన మంత్రాలయంలో పూజలు నిర్వహిస్తున్నారా? చెర్రీ, ఎన్టీఆర్‌లతో సినిమా ప్రకటించిన రాజమౌళీ ఇప్పుడు ఎక్కడున్నారు? అనే ప్రశ్నలు ఇప్పుడు టాలీవుడ్‌లో షికారు చేస్తున్నాయి. ఈ ఏడాది ఆయనకు రాశులు అనుకూలించవని తెలిసే ఈ పూజలు నిర్వహిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
Samayam Telugu director rajamouli visits mantralayam
మంత్రాలయంలో రాజమౌళీ ప్రత్యేక పూజలు?


ఇప్పటివరకు రాజమౌళికి శుక్ర దశ వల్ల పట్టిందల్లా బంగారంలా కెరీర్ నడించిందట. ‘బాహుబలి’ సీరిస్‌లతో తిరుగులేని విజయాలను సాధించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళీ పేరు సంపాదించడానికి కారణం కూడా ఇదేనట. అయితే, ఈ ఏడాది శుక్ర దశ పూర్తికానుందని, తర్వాతి దశలో గ్రహాల అనుకూలత కోసం పూజలు చేయాలని పండితులు చెప్పడంతో రాజమౌళీ మంత్రాలయంలో గట్టిగా పూజలు చేస్తున్నారని టాలీవుడ్ సమాచారం. ఈ ప్రచారం ఎంత వరకు నిజమనేది రాజమౌళీ స్పందిస్తేనే తెలుస్తుంది.

అయితే, రాజమౌళీ మంత్రాలయం సందర్శించం ఇదే తొలిసారి కాదు. ఆయన గతంలో కూడా పలుసార్లు అక్కడికి వెళ్లి పూజలు నిర్వహించారు. గతేడాది మే నెలలో కూడా ఆయన కుటుంబ సమేతంగా మంత్రాలయం సందర్శించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు వందసార్లైనా మంత్రాలయానికి వెళ్లి ఉంటానని తెలిపారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో షికారు చేస్తున్న ‘గ్రహాల పూజలు’ వదంతులు కూడా కావచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.