యాప్నగరం

Ram Gopal Varma: ఏసీపీని కలిసిన వర్మ.. అనుమతి లేకుండానే సినిమా

రామ్‌గోపాల్ వర్మ ‘దిశ’ అనే సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే. గతేడాది వెటర్నరీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన నేపథ్యంలో సినిమా తెరకెక్కనుంది.

Samayam Telugu 17 Feb 2020, 3:16 pm
ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే నిందితుడైన చెన్నకేశవులు భార్యను రాంగోపాల్ వర్మ కొన్ని రోజుల క్రితమే కలిశారు. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి అసలు పోలీసుల తరఫున ఏం జరిగింది ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇందులో భాగంగానే శంషాబాద్ ఏసిపిని డైరెక్ట్‌గా రామ్‌ గోపాల్ వర్మ కలిశారు.
Samayam Telugu Ram gopal varma
రామ్ గోపాల్ వర్మ


ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ప్రధానంగా దిశపై ఎఫ్ఐఆర్ నమోదైన దగ్గర్నుంచి ఎన్‌కౌంటర్ జరిగిన పూర్తి వివరాలు కూడా తెలుసుకున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి అనుమతి తీసుకున్నారా లేదా అనే విషయం ప్రశ్నించినప్పుడు సినిమాపై ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని సినిమా తీసేందుకు స్వేచ్ఛ ఉందని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు.

READ ALSO: జయలలిత బయోపిక్‌లో ఇతనే శోభన్ బాబు!

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ ఘటనను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. తెలంగాణకు చెందిన వెటర్నరీ వైద్యురాలిని నలుగురు వ్యక్తులు మద్యం తాగించి దారుణంగా రేప్ చేసి సజీవదహనం చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. తెలంగాణ పోలీసులు దిశ నిందితులను కాల్చి చంపినా ఇంకా ఆ ఘటన తెలుగు ప్రజల కళ్ల ముందు మెదులుతూనే ఉంది. అందుకే ఈసారి రామ్ గోపాల్ వర్మ ‘దిశ’ ఘటనను తన తర్వాతి సినిమా కాన్సెప్ట్‌గా ఎంచుకున్నారు. ఈ విషయాన్ని వర్మ ట్విటర్ ద్వారా ప్రకటించారు.

READ ALSO: Dhanush: నేనే విడాకులు అడిగాను, ధనుష్‌కు సంబంధం లేదు: అమలా పాల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.