యాప్నగరం

డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన తల్లి కన్నుమూత

పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. శంకర్ తల్లి ముత్తులక్ష్మి (88) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు.

Samayam Telugu 18 May 2021, 9:09 pm
సినీ ఇండస్ట్రీ నుంచి వరుసగా విషాద వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా రక్కసి కారణంగా కొందరు సినీ నటులు కన్నుమూస్తుండగా అనారోగ్య కారణాలతో మరికొంత మంది సినిమా వాళ్ళు మరణిస్తున్నారు. తాజాగా పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. శంకర్ తల్లి ముత్తులక్ష్మి (88) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. వయసు మీదపడటంతో అనారోగ్య సమస్యలతో ఆమె మరణించినట్లు సమాచారం.
Samayam Telugu డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన తల్లి కన్నుమూత
Shankar Mother Death


శంకర్ తల్లి మరణ వార్త తెలియగానే తమిళ, తెలుగు సెలబ్రిటీలు పెద్దఎత్తున స్పందిస్తూ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కుటుంబం లోని అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండే ముత్తులక్ష్మి కన్నుమూయడంతో శంకర్ ఫ్యామిలీ అంతా విషాదంలో మునిగిపోయింది. బుధవారం ఉదయం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.
ఎమర్జెన్సీ ఫుడ్‌.. ప్రపంచం నాశనం అయిపోయినా మనకు డోకా ఉండదు: పూరి జగన్నాథ్
ప్రస్తుతం కమల్ హాసన్‌తో 'ఇండియన్ 2' సినిమా చేస్తున్న శంకర్.. ఇటీవలే మరో రెండు ప్రాజెక్ట్స్ పనులతో బిజీ అయ్యారు. దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్న ఆయన, ఈ సినిమాను దాదాపు ఐదు భాషల్లో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే 'అపరిచితుడు' సినిమాను హిందీలో రణవీర్ సింగ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు శంకర్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.