యాప్నగరం

SSMB 27: సూపర్‌ స్టార్‌ నెక్ట్స్‌.. మళ్లీ ఆ డైరెక్టర్‌ తోనే!

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా పనుల్లో బిజీగా ఉన్న సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, తన నెక్ట్స్‌ సినిమాను ఫైనల్‌ చేశాడు. తనకు మహర్షి లాంటి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ అంధించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నెక్ట్స్‌ సినిమా చేయనున్నాడు మహేష్‌.

Samayam Telugu 6 Dec 2019, 10:41 am
సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరగుతున్నాయి. ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ప్రతీ సోమవారం ఓ అప్‌డేట్‌ను రిలీజ్‌ చేస్తున్నారు. త్వరలోనే మహేష్‌ బాబు కూడా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు.
Samayam Telugu Mahesh Babu Vamsi Paidipally
మహేష్ బాబు - వంశీ పైడిపల్లి


సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సరిలేరు నీకెవ్వరు రిలీజ్‌కు ముందే తదుపరి చిత్రాన్ని మహేష్‌ ఫైనల్‌ చేసినట్టుగా తెలుస్తోంది. మహేష్‌ 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మరోసారి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. మహర్షి సినిమాకు దర్శకత్వం వహించిన దగ్గర నుంచి మహేష్, వంశీల మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.
Also Read: ఆ సినిమా దగ్గుబాటి `మనం` కానుందా..? వెంకీ సినిమాపై క్రేజీ అప్‌డేట్‌

మహర్షి తరువాత వెంటనే వంశీ దర్శకత్వంలో మహేష్ మరో సినిమా చేస్తున్నాడన్న టాక్‌ వినిపించింది. అయితే కథా కథనాలు సిద్ధంకాకపోవటంతో ఆ ఆలోచనను విరమించుకున్నాడు మహేష్‌. ఈలోగా సరిలేరు నీకెవ్వరు సినిమాను పూర్తి చేసిన మహేష్ ఇప్పుడు వంశీ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా దాదాపుగా మహేష్ నెక్ట్స్ ఇదే అని ఫిక్స్‌ అవుతున్నారు ఫ్యాన్స్‌. అంతేకాదు ఈ సినిమాతో మహేష్ తొలిసారిగా ఓ గ్యాంగ్‌స్టర్‌గా నటించనున్నాడట. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన బిజినెస్‌మెన్‌ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌ తరహా పాత్రలో కనిపించాడు మహేష్. కానీ నెక్ట్స్ సినిమాలో పూర్తి స్థాయి గ్యాంగ్‌స్టర్‌గా కనిపించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
Also Read: `అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు`రిలీజ్‌పై వర్మ సంచలన నిర్ణయం

కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ సినిమాలో దిల్‌ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నాడు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో సీనియర్‌ నటి విజయశాంతి చాలా కాలం తరువాత సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.