ఎన్నో ఏళ్లుగా హిట్ కోసం ఎదురుచూసిన కథానాయకుడు రాజశేఖర్కు గతేడాది ‘పీఎస్వీ గరుడ వేగ’ఆ లోటును తీర్చింది. అయితే ఈ చిత్రంపై డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన యూరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సిటీ సివల్ కోర్టు ఇకపై గరుడవేగ చిత్రాన్ని ప్రదర్శించరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టీవీల్లోగానీ, యూట్యూబ్, సోషల్ మీడియా లాంటి ఇతరత్ర ఏరకంగానూ ప్రదర్శన ఉండరాదని, దీనికి సంబంధించి ప్రచార కార్యక్రమాలు, ప్రెస్మీట్లు నిర్వహించరాదంటూ దర్శక నిర్మాతలతోపాటు యూట్యూబ్ను ఆదేశించింది. గరుడ వేగ సినిమా తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని యూసీఐ తన ఫిర్యాదులో పేర్కొవడంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ పిటిషన్పై సిటీ సివిల్ కోర్టు 4వ జూనియర్ సివిల్ జడ్జి కె.కిరణ్కుమార్ విచారణ చేపట్టారు. సినిమా మొత్తం యురేనియం కార్పొరేషన్లో జరిగిన కుంభకోణం నేపథ్యంలో సాగిందని పిటిషనర్ తరఫు న్యాయవాది పి.శ్రీహర్షారెడ్డి వాదించారు. తమ సంస్థకు చెందిన యురేనియం ప్లాంట్ ఏపీలోని తుమ్మలపల్లిలో ఉందన్నారు. ఈ ప్లాంట్ నుంచి అక్రమంగా ప్లూటోనియం, థోరియం తరలించినట్టు, ఈ స్కాంలో తుమ్మలపల్లి ఎమ్మెల్యే, హోంమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రిత్వశాఖ అధికారులు, యురేనియం కార్పొరేషన్ ఛైర్మన్, ఉన్నతాధికారులు పాత్రధారులైనట్లు చిత్రీకరించి కించపరిచారని వాదించారు. ఎన్ఐఏ అసిస్టెంట్ కమిషనర్ ఈ కుంభకోణాన్ని వెలికి తీసినట్టు చూపారని, అందువల్ల చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు.
ఇది తమ సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించి, దిగజార్చేలా ఉందని యూసీఐ తరఫు లాయర్ వ్యాఖ్యానించారు. వారి వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి తదుపరి ఉత్తర్వులు వెలువడేదాక చిత్ర ప్రదర్శన నిలిపివేయాలని పేర్కొన్నారు. ఎలాంటి ప్రచార కార్యక్రమాలు, ప్రెస్మీట్లు నిర్వహించరాదంటూ జారీచేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దీనిపై తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసినట్టు తెలిపారు. గతేడాది నవంబరులో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల వారినీ అకట్టుకుంది.. విడుదలై ఆరు మాసాలు కావస్తుంటే ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం విశేషం.
ఈ పిటిషన్పై సిటీ సివిల్ కోర్టు 4వ జూనియర్ సివిల్ జడ్జి కె.కిరణ్కుమార్ విచారణ చేపట్టారు. సినిమా మొత్తం యురేనియం కార్పొరేషన్లో జరిగిన కుంభకోణం నేపథ్యంలో సాగిందని పిటిషనర్ తరఫు న్యాయవాది పి.శ్రీహర్షారెడ్డి వాదించారు. తమ సంస్థకు చెందిన యురేనియం ప్లాంట్ ఏపీలోని తుమ్మలపల్లిలో ఉందన్నారు. ఈ ప్లాంట్ నుంచి అక్రమంగా ప్లూటోనియం, థోరియం తరలించినట్టు, ఈ స్కాంలో తుమ్మలపల్లి ఎమ్మెల్యే, హోంమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రిత్వశాఖ అధికారులు, యురేనియం కార్పొరేషన్ ఛైర్మన్, ఉన్నతాధికారులు పాత్రధారులైనట్లు చిత్రీకరించి కించపరిచారని వాదించారు. ఎన్ఐఏ అసిస్టెంట్ కమిషనర్ ఈ కుంభకోణాన్ని వెలికి తీసినట్టు చూపారని, అందువల్ల చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు.
ఇది తమ సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించి, దిగజార్చేలా ఉందని యూసీఐ తరఫు లాయర్ వ్యాఖ్యానించారు. వారి వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి తదుపరి ఉత్తర్వులు వెలువడేదాక చిత్ర ప్రదర్శన నిలిపివేయాలని పేర్కొన్నారు. ఎలాంటి ప్రచార కార్యక్రమాలు, ప్రెస్మీట్లు నిర్వహించరాదంటూ జారీచేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దీనిపై తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసినట్టు తెలిపారు. గతేడాది నవంబరులో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల వారినీ అకట్టుకుంది.. విడుదలై ఆరు మాసాలు కావస్తుంటే ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం విశేషం.