తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈకేసులో సిట్ ఛార్జ్షీట్ను అధికారులు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో టాలీవుడ్కు చెందిన ముగ్గురిపై అభియోగాలు చేర్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఎఫ్ఎస్ఎల్కు పంపిన శాంపిల్స్లో వారికి పాజిటివ్ వచ్చిందట. ఇద్దరికి సంబంధించిన ల్యాబ్ రిపోర్టులు కోర్టుకు కూడా చేరాయట. మరికొంతమందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. అవి కూడా వస్తే మరికొంతమందిని కూడా చేర్చే అవకాశం ఉందట.
కెల్విన్ అనే డ్రగ్ డీలర్ అరెస్ట్ తర్వాత టాలీవుడ్లో డొంక కదిలింది. ఇండస్ట్రీతో తనకు ఉన్న సంబంధాల గురించి అతడు దర్యాప్తులో చెప్పడంతో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. టాలీవుడ్కు చెందిన పదిమందికి నోటీసులు పంపి విచారణకు పిలిచారు. వీరిలో పూరీ జగన్నాథ్, శ్యాం కె నాయుడు, రవితేజ, తరుణ్, నవదీప్, తనీష్, నందు, చార్మి, ముమైత్ఖాన్, సుబ్బరాజులు ఉన్నారు. వీరిలో కొంతమంది నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు సేకరించి... ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఈ రిపోర్టులు ఆధారంగానే ఛార్జ్షీట్ను ఫైల్ చేశారు.
కెల్విన్ అనే డ్రగ్ డీలర్ అరెస్ట్ తర్వాత టాలీవుడ్లో డొంక కదిలింది. ఇండస్ట్రీతో తనకు ఉన్న సంబంధాల గురించి అతడు దర్యాప్తులో చెప్పడంతో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. టాలీవుడ్కు చెందిన పదిమందికి నోటీసులు పంపి విచారణకు పిలిచారు. వీరిలో పూరీ జగన్నాథ్, శ్యాం కె నాయుడు, రవితేజ, తరుణ్, నవదీప్, తనీష్, నందు, చార్మి, ముమైత్ఖాన్, సుబ్బరాజులు ఉన్నారు. వీరిలో కొంతమంది నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు సేకరించి... ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఈ రిపోర్టులు ఆధారంగానే ఛార్జ్షీట్ను ఫైల్ చేశారు.