యాప్నగరం

డ్రగ్స్ కేసు: సిట్ ముందుకు పూరీ..

టాలీవుడ్‌లో ప్రకంపనలు రేకెత్తించిన డ్రగ్స్‌ కేసు విచారణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) వేగం పెంచింది. సంచలనం..

TNN 17 Jul 2017, 7:55 pm
టాలీవుడ్‌లో ప్రకంపనలు రేకెత్తించిన డ్రగ్స్‌ కేసు విచారణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) వేగం పెంచింది. సంచలనం సృష్టించిన ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ సిట్ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఈ నెల 19న సిట్‌ ఆయనను విచారించనుంది. అబ్కారీ శాఖ ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరి కొంతమందికి కూడా నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Samayam Telugu drugs case sit interrogates director puri jagannath on july 19
డ్రగ్స్ కేసు: సిట్ ముందుకు పూరీ..


నోటీసులు జారీ చేసిన వారందరినీ సిట్‌ ప్రత్యేకంగా విచారించనుంది. ఈ క్రమంలో అధికారులు మొదట పూరీ జగన్నాథ్‌ను విచారించనున్నారు. ఆ తర్వాత రోజుకొకర్ని చొప్పున పిలిపించి, కూపీ లాగుతారు. అబ్కారీ శాఖ ఇప్పటి వరకు అధికారికంగా ఎవరి పేర్లూ చెప్పకపోయినా.. పలువురి సినీ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.