యాప్నగరం

అర్ధరాత్రి 'బాహుబలి 2' సినిమా కావాలని దాడి

బాహుబలి 2 సినిమా రిలీజై నిన్నటితో నెల పూర్తయినా ఆ సినిమాకి వున్న క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు..

Samayam Telugu 29 May 2017, 11:52 am
బాహుబలి 2 సినిమా రిలీజై నిన్నటితో నెల పూర్తయినా ఆ సినిమాకి వున్న క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. రిలీజైన రోజు నుంచి నేటి వరకు బాహుబలి 2 సినిమా ప్లే అవుతున్న థియేటర్లు హౌజ్‌ఫుల్ అవుతూ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకి కాసుల వర్షం కురిపిస్తోంది. ఇదిలావుంటే, తాజాగా అనంతపురం జిల్లా గుత్తిలో నిన్న రాత్రి కొందరు వ్యక్తులు మద్యం మత్తులో కేపీఎస్‌ థియేటర్‌ సిబ్బందిపై డాడికి పాల్పడ్డారు. తాగిన మత్తులో వున్న యువకులు తమకోసం అర్ధరాత్రి బాహుబలి-2 సినిమాను ప్రదర్శించాలని డిమాండ్ చేశారు.
Samayam Telugu drunken youth attacked on theatre staff for baahubali 2 screening
అర్ధరాత్రి 'బాహుబలి 2' సినిమా కావాలని దాడి


ఈ సమయంలో సినిమా ప్రదర్శించడం కుదరదని, రేపు మ్యాట్నీ షోకి రమ్మని థియేటర్‌ సిబ్బంది నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ అందుకు ఆగ్రహించిన మందుబాబులు అదే మత్తులో వారిపై దాడికి పాల్పడ్డారు. మందుబాబులు దాడికి పాల్పడిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సోమవారం ఉదయం థియేటర్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో గుత్తి పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం వేట మొదలెట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.