గతంలో మమ్ముట్టీ పలు తెలుగు సినిమాల్లో నటించాడు. ‘స్వాతి కిరణం’ ‘రైల్వే కూలీ’ వంటి డైరెక్టు తెలుగు సినిమాల్లో మమ్ముట్టీ ప్రధాన పాత్రలో నటించాడు. అయితే మమ్ముట్టీ అనువాద చిత్రాలు హిట్ అయిన స్థాయిలో డైరెక్టు తెలుగు సినిమాలు హిట్ కాలేదు. పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగువారిని ఆకట్టుకున్నాడు మమ్ముట్టీ. ఇప్పుడు ఆయన తనయుడు డబ్బింగ్ సినిమాలతో తెలుగు వారికి పరిచయస్తుడయ్యాడు.
తమిళంలో రూపొందిన ‘ఓకే బంగారం’ తెలుగు డబ్బింగ్ తో మమ్ముట్టీ తనయుడు దుల్కర్ సల్మాన్ కు మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత దుల్కర్ మలయాళ సినిమాలు కొన్ని తెలుగులోకి అనువాదం అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఒక డైరెక్ట్ తెలుగు సినిమాలో దుల్కర్ హీరోగా నటించనున్నాడని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో ఆ సినిమా రూపొందుతుందని కూడా అంటున్నారు.
ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి కొత్త డెవలప్ మెంట్స్ చోటు చేసుకున్నాయట. అందులో హీరోయిన్ గా నటించడానికి శాలినీ పాండేను ఎంపిక చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ‘అర్జున్ రెడ్డి’తో తెలుగు చిత్రసీమకు పరిచయమై మంచి గుర్తింపు సంపాదించుకున్న శాలినీ దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించనున్నదట. మరి ఈ సినిమాకు సంధించి అధికారిక ప్రకటన ఎప్పుడో!
తమిళంలో రూపొందిన ‘ఓకే బంగారం’ తెలుగు డబ్బింగ్ తో మమ్ముట్టీ తనయుడు దుల్కర్ సల్మాన్ కు మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత దుల్కర్ మలయాళ సినిమాలు కొన్ని తెలుగులోకి అనువాదం అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఒక డైరెక్ట్ తెలుగు సినిమాలో దుల్కర్ హీరోగా నటించనున్నాడని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో ఆ సినిమా రూపొందుతుందని కూడా అంటున్నారు.
ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి కొత్త డెవలప్ మెంట్స్ చోటు చేసుకున్నాయట. అందులో హీరోయిన్ గా నటించడానికి శాలినీ పాండేను ఎంపిక చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ‘అర్జున్ రెడ్డి’తో తెలుగు చిత్రసీమకు పరిచయమై మంచి గుర్తింపు సంపాదించుకున్న శాలినీ దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించనున్నదట. మరి ఈ సినిమాకు సంధించి అధికారిక ప్రకటన ఎప్పుడో!