ఇటీవలే రిలీజైన దువ్వాడ జగన్నాథం సినిమా ఫస్ట్ లుక్కి ఆడియెన్స్ నుంచి మంచి రెప్సాన్స్ లభించింది. ఇదిలావుండగానే తాజాగా ఓ వివాదంతో ఈ సినిమా పేరు మరోసారి వార్తల్లోకొచ్చింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న దువ్వాడ జగన్నాథం సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలోని బేలూరులో జగురుతోంది. ఇక్కడి చెన్నకేశవ స్వామి ఆలయంలో జరుగుతున్న సినిమా షూటింగ్ కోసం మూవీ యూనిట్ ఆలయంలో ఓ శివుడి విగ్రహం ఏర్పాటు చేసింది.
అయితే, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలకి అది విరుద్దం అని ఆలయం పూజారులు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీనికితోడు చిత్రం షూటింగ్ కారణంగా తమకి ఆలయ దర్శనం చేసుకోనివ్వడం లేదని స్థానికులు, భక్తులు నిరసనకి దిగి షూటింగ్ అడ్డుకున్నారు. దీంతో తాత్కాలికంగా షూటింగ్ ఆపేసింది మూవీ యూనిట్.
దీంతో సమస్య చేయిదాటిపోకముందే సీన్లోకి ఎంటరైన పోలీసులు నిరసనకారులకి నచ్చచెప్పి శాంతింపజేశారు. ఈ షూటింగ్ ప్రారంభించడానికన్నా ముందుగానే తాము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకున్నట్టు మూవీ యూనిట్ తెలిపింది. ఏదేమైనా సమస్యకు ఓ పరిష్కారం లభించడంతో తిరిగి గురువారం నుంచే మళ్లీ షూటింగ్ స్టార్ట్ అయింది. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
అయితే, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలకి అది విరుద్దం అని ఆలయం పూజారులు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీనికితోడు చిత్రం షూటింగ్ కారణంగా తమకి ఆలయ దర్శనం చేసుకోనివ్వడం లేదని స్థానికులు, భక్తులు నిరసనకి దిగి షూటింగ్ అడ్డుకున్నారు. దీంతో తాత్కాలికంగా షూటింగ్ ఆపేసింది మూవీ యూనిట్.
దీంతో సమస్య చేయిదాటిపోకముందే సీన్లోకి ఎంటరైన పోలీసులు నిరసనకారులకి నచ్చచెప్పి శాంతింపజేశారు. ఈ షూటింగ్ ప్రారంభించడానికన్నా ముందుగానే తాము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకున్నట్టు మూవీ యూనిట్ తెలిపింది. ఏదేమైనా సమస్యకు ఓ పరిష్కారం లభించడంతో తిరిగి గురువారం నుంచే మళ్లీ షూటింగ్ స్టార్ట్ అయింది. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.