యాప్నగరం

Rakul Preet Singh: హీరోయిన్‌ రకుల్ ప్రీత్‌కు ఈడీ నోటీసులు.. డ్రగ్స్ కేసు రీఓపెన్

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆమెకు నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని సదరు నోటీసుల్లో పేర్కొంది. బెంగళూరు డ్రగ్స్ కేసు రాష్ట్రంలో కలకలం రేపగా.. ఇందుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి కూడా ఈ సందర్భంగా నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది. ఆయన కూడా 19వ తేదీన విచారణకు అటెండ్ కావాల్సి ఉంది.

Authored bySanthosh Damera | Samayam Telugu 16 Dec 2022, 2:09 pm

ప్రధానాంశాలు:

  • హీరోయిన్‌కు రకుల్‌ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు
  • డ్రగ్స్ కేసులో ఈ నెల 19న విచారణకు ఆదేశం
  • ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సైతం నోటీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rakul Preet Singh
రకుల్‌ప్రీత్ సింగ్
టాలీవుడ్‌లో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగులో స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేసిన ఆమె.. ఈ మధ్య బాలీవుడ్‌పై ఫోకస్ చేసింది. అక్కడ ప్రముఖ ఫిలిం మేకర్ జాకీ భగ్నానీతో డేటింగ్ చేస్తు్న్నట్లు రూమర్స్ కూడా వినిపించాయి. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ డ్రగ్స్ కేసు విషయంలో గతంలో ఆమె పేరు వినిపించిన సంగతి తెలిసిందే. అంతేకాదు విచారణకు హాజరైన తనను ఈడీ దాదాపు ఆరు గంటలకు పైగా ప్రశ్నించింది. అయితే ఆ తర్వాత ఈ కేసు ప్రస్తావన మీడియాలో కనిపించలేదు.
టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం గతంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసుకు సంబంధించి పలువురు ఫిలిం స్టార్లను గతేడాది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారిచింది. కానీ ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో కొంతకాలంగా ఈ కేసులో పురోగతి లేదు. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీసులు.. ఈడీ అధికారులకు ఇచ్చిన సమాచారంలో కోర్టుకు సమర్పించని కీలకమైన వాంగ్మూలాలు ఉన్నాయనే రూమర్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ డ్రగ్స్ కేసు నిందితులకు ఈడీ ప్రత్యేకంగా నోటీసులు జారీ అవకాశాలున్నాయని గతంలో ప్రచారం కూడా జరిగింది. అయితే ఈడీ.. ఆధారాలను జాగ్రత్తగా పరిశీలించిన మీదట, తాజాగా రకుల్ ప్రీత్‌తో పాటు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేసి షాక్ ఇచ్చింది. వీరిని ఈ నెల 19న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.

రచయిత గురించి
Santhosh Damera
సంతోష్ దామెర సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ సినిమా, ఎంటర్\u200cటైన్\u200cమెంట్ రంగాలకు సంబంధించిన కొత్త అప్\u200cడేట్స్, స్పెషల్ స్టోరీలు అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, లైఫ్\u200cస్టైల్ స్టోరీస్, సినిమాకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.