యాప్నగరం

టాలీవుడ్‌లో మరో విషాదం... కరోనాతో యువ హీరో తండ్రి మృతి

టాలీవుడ్‌లో కరోనా కలకలం రేపుతోంది. పలువురు ప్రముఖులు ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. తాజాగా యువ హీరో తండ్రి కరోనాతో మృతి చెందడం సినీ పరిశ్రమలో మరింత కలవరం రేకెత్తిస్తోంది.

Samayam Telugu 9 Jul 2020, 11:03 am
టాలీవుడ్, టీవీ ఇండస్ట్రీలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా ఈరోజుల్లో సినిమా నటుడు శ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి మంగం వెంకట దుర్గా రాంప్రసాద్‌ కరోనా వైరస్‌ బారిన పడి మృతి చెందారు. గత 20 రోజులుగా కరోనాతో బాధపడుతూ ఆయన విజయవాడలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆయన బుధవారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు తుది శ్వాస విడిచారు.
Samayam Telugu హీరో శ్రీ తండ్రి కరోనాతో మృతి
ee rojullo telugu movie actor sri’s father passes away due to coronavirus

Read More:బాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్ యాక్టర్ జగ్‌దీప్ కన్నుమూత
ప్రముఖ డైరెక్టర్‌ మారుతి తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ రోజుల్లో సినిమాతో శ్రీ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతడు లవ్‌ సైకిల్‌ సినిమాలో నటించాడు. మరోవైపు సినీ పరిశ్రమలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తెలుగు సినీ నిర్మాత పోకూరి రామారావు కరోనాతో మరణించారు. అదే విధంగా పలువురు టీవీ నటులు కూడా కరోనా బారిన పడ్డారు. టీవీ నటులు రవికృష్ణ, రాజశేఖర్, సాక్షి శివ, రవికృష్ణ, సీరియల్‌ నటి నవ్య స్వామికి కరోనా సోకిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.