యాప్నగరం

నా ప్రతి ఒక్క అభిమాని గర్వపడతారు.. విజయవాడలో మహేష్ బాబు

విజయవాడలో ఆదివారం మహేష్ బాబు అభిమానులు హంగామా చేశారు. దీనికి కారణం మహేష్ బాబు విజయవాడకు రావడమే. ఓ జ్యువెలరి షో రూంను ప్రారంభించడానికి ఆయన విజయవాడ వచ్చారు.

Samayam Telugu 13 Oct 2019, 6:04 pm
సూపర్ స్టార్ మహేష్ బాబు విజయవాడలో సందడి చేశారు. ఎంజీ రోడ్డులో కొత్తగా ఏర్పాటుచేసిన భీమ జ్యువెలరి షో రూంను ప్రారంభించేందుకు ఆదివారం ఆయన విజయవాడ వచ్చారు. జ్యోతి ప్రజ్వలన చేసి షో రూంను మహేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మహేష్ మాట్లాడుతూ ఏపీలో తొలి షో రూంను ఏర్పాటుచేసిన భీమ జ్యువెలర్స్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
Samayam Telugu Mahesh_Babui
విజయవాడలో మహేష్ బాబు


‘‘విజయవాడకు రావడం నాకెప్పుడు సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. నా అన్ని సినిమాల 100 రోజుల వేడుకలు కానీ, ఇతర సెలబ్రేషన్స్ కానీ విజయవాడలోనే జరిగాయి. విజయవాడ నా మనసుకు ఎప్పుడూ దగ్గరగా ఉంటుంది. ఇక్కడే భీమ షోరూంను ప్రారంభించడానికి రావడం చాలా సంతోషంగా ఉంది. వాళ్లకి ఆల్ ది బెస్ట్’’ అని మహేష్ అన్నారు.

Also Read: ‘సైరా’ కలెక్షన్స్: ఇక్కడ సేఫ్.. కానీ, అక్కడ నష్టాలేనా..!

తన అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మహేష్ బాబు.. తన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ ఈ సంక్రాంతికి వస్తుందని చెప్పారు. ఈ సినిమాను చూసి తన ప్రతి ఒక్క అభిమాని గర్వపడతారని మహేష్ అన్నారు. కాగా, తమ ఊరికి సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తున్నారని తెలియడంతో ఆయన్ని చూసేందుకు ఘట్టమనేని అభిమానులతో పాటు జనం భారీగా షోరూం వద్దకు తరలివచ్చారు. మహేష్ ఫ్యాన్స్ అయితే పోస్టర్లు, ప్లకార్డులతో హంగామా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.