యాప్నగరం

ఆర్జీవీ పిచ్చివాగుడు ఆపు.. నోరు మూయించాలి: మాజీ ఎమ్మెల్యే ఫైర్

రామ్ గోపాల్ వర్మపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆర్జీవీపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. మరొకరు ఇలా మాట్లాడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 26 Jun 2022, 2:15 pm
ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌప‌ది ముర్ము (Draupadi Murmu)పై వివాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆర్జీవీ వెనక్కి తగ్గి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చినా.. అతనిపై బీజేపీ నేతలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా వర్మపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఫైర్ అయ్యారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్జీవీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Samayam Telugu రామ్ గోపాల్ వర్మపై విష్ణు కుమార్ రాజు ఫైర్


'పిచ్చిపిచ్చి ట్వీట్లు చేసే రామ్ గోపాల్ వర్మ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌప‌ది ముర్ముపై చేసిన వ్యాఖ్యలు దౌర్భాగ్యమన్నారు. ఇటువంటి వ్యక్తిని ప్రజాసామ్యంలో ఎవరూ హర్షించరు. ముందుగా రామ్ గోపాల్ వర్మ ట్వీట్టర్ అకౌంట్‌ను డిలీట్ చేయండి. వర్మపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాలలో కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి.

ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉంది కదా.. అని మితిమీరిన పోకడలకు పోతే రాంగోపాల్ వర్మ ఉదాంతం గుర్తు చేసుకునే విధంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి..' అని విష్ణుకుమార్ రాజు అన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడే వారికి నోరు ముయించే విధంగా ప్రజాస్వామ్యంలో ఉండాలన్నారు.

'ద్రౌపది రాష్ట్రపతి అయితే.. పాండవులు ఎవరు..? ఇంకా ముఖ్యమైన విష‌యం ఏంటంటే కౌర‌వులు ఎవ‌రు..?' అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఆర్జీవీ.. విపరీతమైన ట్రోలింగ్ రావడంతో వెనక్కితగ్గాడు. తన ఉద్దేశం అది కాదని.. ఎవరి మనోభావాలని దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పాడు. ప్రపంచం మొత్తంలో ఎప్పటికీ గొప్ప రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మ అవుతారనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని చెప్పాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.