బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర కోలుకుంటున్నారని ఆయన భార్య ప్రముఖ నటి హేమమాలిని చెప్పారు. జీర్ణ సంబంధిత అనారోగ్య సమస్యలతో ధర్మేంద్ర మంగళవారం నాడు ముంబైలోని నానావతి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని త్వరలోనే ఆసుపత్రి నుండి డిశ్చార్జి అవుతారని హేమమాలిని తెలిపారు
ఇదిలా ఉండగా ధర్మేంద్ర అనారోగ్యంపై సోషల్ మీడియాలో వదంతులు వ్యాపింపచేయడం పట్ల ఆయన కుమారుడు సన్నీ డియోల్ ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మేంద్ర బాగానే ఉన్నారని ఆయన పరిస్థితిపై పుకార్లు పుట్టించవద్దని సన్నీ డియోల్ నెటిజన్లను కోరారు.
ఇదిలా ఉండగా ధర్మేంద్ర అనారోగ్యంపై సోషల్ మీడియాలో వదంతులు వ్యాపింపచేయడం పట్ల ఆయన కుమారుడు సన్నీ డియోల్ ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మేంద్ర బాగానే ఉన్నారని ఆయన పరిస్థితిపై పుకార్లు పుట్టించవద్దని సన్నీ డియోల్ నెటిజన్లను కోరారు.