యాప్నగరం

ముచ్చటగా మూడో ఛాన్స్.. సారీ చెప్పిన సాయి పల్లవి!

ఫిదా ఘనవిజయం.. తర్వాత నానితో ఎంసీఏ.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సాయి పల్లవి.. ముచ్చటగా మూడో ఛాన్స్ ఇస్తానంటే నో చెప్పిందట.

TNN 9 Dec 2017, 9:59 am
‘ఫిదా’ సినిమా ఘన విజయం సాధించడంతో తెలుగునాట సాయి పల్లవి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. తన నటనతో ఆమె నిజంగానే జనాల్ని ఫిదా చేసింది. ఆ సినిమా తర్వాత నానితో ఆమె నటించిన ఎంసీఏ మూవీ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. నేచురల్ స్టార్‌తో సాయి పల్లవి కలిసి నటించిన ఈ సినిమా హిట్ కావడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. సాయి పల్లవి నటన, అంకితభావం ఆయన్ను కట్టి పడేశాయట.
Samayam Telugu fidaa heroine sai pallavi rejects dil raju offer
ముచ్చటగా మూడో ఛాన్స్.. సారీ చెప్పిన సాయి పల్లవి!


దీంతో నితిన్‌తో చేయబోతున్న సినిమాకు కూడా సాయి పల్లవినే హీరోయిన్‌గా తీసుకోవాలని భావించారట. నితిన్, దిల్ రాజు కాంబినేషన్లో సుదీర్ఘ విరామం తర్వాత సినిమా వస్తోంది. గతంలో తెరకెక్కిన ‘దిల్’ మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతోపాటు.. నిర్మాతకు ‘దిల్’ పేరిట ఇంటి పేరైంది.

అలాంటి సూపర్ హిట్ కాంబినేషన్లో.. సతీశ్ వేగ్న దర్శకత్వంలో శ్రీనివాస కల్యాణం సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో నితిన్ సరసన నటించాలని దిల్ రాజు సాయి పల్లవిని కోరారట. కానీ ఆమె సున్నితంగా నో చెప్పిందట. రెమ్యూనరేషన్ భారీగా ఇచ్చేందుకు సిద్ధపడినా.. ఆమె మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదట.

సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యం లేకపోవడంతోనే సాయి పల్లవి నో చెప్పిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఆమె మాత్రం.. డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడం వల్లే ఇలా చేశానని చెబుతోందట. ఈ వార్తలు ఎంత వరకు నిజమో కానీ.. ఫిల్మ్ నగర్లో చర్చకు దారితీశాయి. రెండు సినిమాల్లో అవకాశం ఇచ్చి.. తెలుగులో నిలదొక్కుకోవడానికి కారణమైన దిల్ రాజు పట్ల సాయి పల్లవి ఇలా వ్యవహరిస్తుందా అని కొందరు ఆశ్చర్యపోతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.