యాప్నగరం

మలయాళీలను ‘ఫిదా’ చేస్తున్న సాయిపల్లవి

ఫిదాతో తెలుగు ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేసిన సాయి పల్లవి మరోసారి మలయాళీల్ని ఆకట్టుకోవడానికి సిద్ధపడుతోంది.

TNN 7 Nov 2017, 4:57 pm
వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగా అలరించిందో తెలిసిందే. తెలంగాణ యాసలో సాయి పల్లవి పలికిన డైలాగ్‌లు, ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా విడుదలయ్యాక సాయి పల్లవిని తెలంగాణ ప్రజలు తమ అమ్మాయిగానే చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. తెలుగు వాళ్లను ఫిదా చేసిన ఈ సినిమా త్వరలోనే కేరళలో విడుదల కానుంది.
Samayam Telugu fidaa malayalam trailer gets good response
మలయాళీలను ‘ఫిదా’ చేస్తున్న సాయిపల్లవి


మలయాళంలో సాయిపల్లవికి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రేమమ్ సినిమా మలయాళం మాతృకలో తాను హీరోయిన్‌గా ఆకట్టుకుంది. ఆ మూవీతో తనకు చక్కటి గుర్తింపు వచ్చింది. అక్కడ సాయి పల్లవికి ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడం కోసం నిర్మాతలు ‘ఫిదా’ను మలయాళంలోకి డబ్ చేశారు. నవంబర్ 6న ట్రైలర్ విడుదల చేయగా.. ఒక్క రోజులోనే 3 లక్షలకు పైగా వీక్షించారు. మొత్తానికి సాయి పల్లవి క్రేజ్ కారణంగా వరుణ్ మలయాళీలకు పరిచయం అవుతున్నాడన్న మాట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.